కీలక తరుణంలో కరుణేది?
రాష్ట్రంలో ఐటీకి అత్యంత అనుకూలమైన నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. తక్కువ వ్యయాల నేపథ్యంలో దిగ్గజ సంస్థలు కూడా ప్రస్తుతం విశాఖ వంటి టైర్-2 నగరాలవైపు చూస్తున్నాయి.
కేంద్రం వద్దే పెండింగులో పలు ప్రతిపాదనలు
ఎదురు చూస్తున్న ఐటీ రంగ సంస్థలు
ఈనాడు, విశాఖపట్నం
విశాఖలో ఐ.టి. రంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయా అని ఎన్నో సంస్థలు ఎదురుచూస్తున్నాయి.
రాష్ట్రంలో ఐటీకి అత్యంత అనుకూలమైన నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. తక్కువ వ్యయాల నేపథ్యంలో దిగ్గజ సంస్థలు కూడా ప్రస్తుతం విశాఖ వంటి టైర్-2 నగరాలవైపు చూస్తున్నాయి. పలు సౌకర్యాల కల్పన నిమిత్తం కేంద్రం దగ్గర పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల్లో కొన్నింటిని ఆమోదించినా ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
* ఐ.టి. సంస్థలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్రం ఐ.టి. ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐ.టి.ఐ.ఆర్.) పథకాన్ని ప్రవేశపెట్టింది. సంస్థల ఏర్పాటుకు వీలుగా నిర్ణీత ప్రాంతాన్ని ఇందులో అభివృద్ధి చేస్తారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కొంత పెట్టుబడి రాయితీ కూడా ఇస్తుంది. ఇక్కడే పర్యాటకం, ఆతిథ్యం, హౌసింగ్, విద్య తదితర రంగాల్లోని అంతర్జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విశాఖలో అమలు చేయాలని కోరుతున్నారు.
* ఆ పథకంతో: దేశంలో బి.పి.ఒ. (బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్) సేవల్ని ప్రోత్సహించడానికి కేంద్రం ‘ఇండియా బి.పి.ఒ. ప్రమోషన్ స్కీం’ను కొద్దికాలం కిందటి వరకు కొనసాగింది. పథకంలో భాగంగా ప్రతి ఉద్యోగానికి కేంద్రం రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాన్ని సంస్థలకు అందించేది. విశాఖలోని ఐ.టి. సంస్థలు ఈ పథక ప్రయోజనాలను భారీగా దక్కించుకున్నాయి. దీంతో బి.పి.ఒ. కేటగిరీలో విశాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పథకం నిలిపివేయడంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
* సీడాక్ ఏదీ: ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్’(సీడాక్) విశాఖలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. కంప్యూటర్ రంగ పరిశోధనలకు ఈ కేంద్రం అత్యంత కీలకం.అదీ కార్యాచరణలోకి రాలేదు. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (నీలిట్) సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. సుశిక్షితులైన మానవ వనరులను సిద్ధం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోర్సులు నిర్వహిస్తుంది. అదీ ఏర్పాటు కాలేదు. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ తదితర విభాగాల ఎగుమతులకు కేంద్రం ఐదుశాతం రాయితీ ఇస్తోంది. వాటినీ రెండేళ్ల నుంచి ఇవ్వడంలేదు. ఆయా రాయితీలు వేగంగా చెల్లించాలంటున్నారు.
కేంద్ర ప్రాజెక్టులతో మహర్దశ
-ఒ.నరేశ్కుమార్, సీఈవో, సింబయాసిస్, విశాఖపట్నం
విశాఖలో ఐ.టి.రంగ అభివృద్ధికి అవసరమైన పలు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులపై ఆ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందిస్తోంది. 5జీ, మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే సంస్థలకు ఎంతో మేలు.
ప్రోత్సాహకాలను కొనసాగించాలి
-ఆర్.ఎల్.నారాయణ, ఐట్యాప్ ప్రతినిధి, విశాఖపట్నం
బీపీవో రంగానికి కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవడంలో విశాఖలోని సంస్థలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో ప్రస్తుతం దేశంలోని దిగ్గజ సంస్థల చూపంతా విశాఖ వైపే ఉంది. కేంద్రం గతంలో ఈ రంగానికి ఇచ్చిన రాయితీలను మరికొంతకాలం కొనసాగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు