రైలులో సీటు దొరకడం గగనమే..!
రిజర్వేషన్ లేని, జరిమానా విధించిన పత్రాలతో వేలాది మంది ప్రయాణిస్తుండటంతో విశాఖ వచ్చే సరికి ఇక్కడి ప్రయాణికులు బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు గంటల తరబడి స్టేషన్లో నిలిచిపోతోంది.
స్లీపర్ బోగీల్లో భారీగా కోత
సాధారణ ప్రయాణికుల అష్టకష్టాలు
న్యూస్టుడే, రైల్వేస్టేషన్
ఇటీవల బొకారో ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులకు అగ్ని పరీక్ష పెడుతోంది. స్లీపర్ బోగీలో రిజర్వేషన్ చేసుకున్నా.. సీటు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి.
బొకారో రైలు వద్ద ప్రయాణికుల రద్దీ
రిజర్వేషన్ లేని, జరిమానా విధించిన పత్రాలతో వేలాది మంది ప్రయాణిస్తుండటంతో విశాఖ వచ్చే సరికి ఇక్కడి ప్రయాణికులు బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు గంటల తరబడి స్టేషన్లో నిలిచిపోతోంది. చివరికి అధికారులు రిజర్వేషన్ లేని, జరిమానా విధించిన వారిని కిందికి దించేయాల్సి వస్తోంది.
* ఇటీవల విశాఖ, అనకాపల్లి, ఎలమంచిలి స్టేషన్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. స్లీపర్ బోగీల్లో భారీగా కోత విధించడమే దీనికి కారణమని తేలింది. ఈ రైలుకు గతంలో 10 వరకు స్లీపర్ బోగీలు ఉండేవి. ఎల్హెచ్బీ బోగీలు ఏర్పాటు తర్వాత స్లీపర్ బోగీలను 5కు తగ్గించేశారు. థర్ట్ ఏసీ బోగీలను ఆరుకు, సెకండ్ ఏసీ బోగీలను నాలుగుకు పెంచేశారు.
దాదాపు అన్ని రైళ్లలోనూ..: విశాఖ మీదుగా రాకపోకలు సాగించే దాదాపు అన్ని రైళ్లలోనూ స్లీపర్ బోగీల్లో కోత విధించారు. గతంలో అన్ని రైళ్లలో ఇవి 10 నుంచి 12 వరకు ఉండేవి. కోరమండల్, మెయిల్ రైళ్లలో వీటిని సగానికి తగ్గించేశారు. ఆ స్థానంలో ఏసీ బోగీలను జత చేశారు. సాధారణ బోగీల్లో 72 సీట్లు ఉంటే, ఎల్హెచ్బీ బోగీల్లో 80 వరకు ఉంటాయని, అందుకే స్లీపర్ బోగీలను తగ్గించామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎల్హెచ్బీ బోగీ వల్ల 8 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఈ లెక్కన ఒక్క స్లీపర్ బోగీ తగ్గిస్తే సరిపోతుంది. కాని సగానికి పైగా కోత పెట్టడం సాధారణ ప్రయాణికులకు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం ఒక్క ఫలక్నుమా రైలులోనే 12 స్లీపర్ బోగీలు కనిపిస్తున్నాయి.
ఆర్థికంగా ఎంతో భారం
ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు దూర ప్రాంతాలకు బస్సుల్లో వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి. వీరిలో ఎక్కువ శాతం రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. టికెట్ ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఉదాహరణకు విశాఖ నుంచి విజయవాడకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో వెళ్లాలంటే రూ.750 ఛార్జి చెల్లించాలి. నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 3,000 ఖర్చవుతుంది. రైలులోని సాధారణ బోగీలో ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.150తో విజయవాడ చేరుకోవచ్చు. స్లీపర్ బోగీలో అయితే రూ.270 వరకు అవుతుంది. నలుగురు కుటుంబ సభ్యులకు రూ.1080 ఖర్చవుతుంది. బస్సుతో పోలిస్తే ఇది రెండు రెట్లు తక్కువ.
ఏసీ కోచ్లు పెంచడం వెనుక..
విశాఖ స్టేషన్ వద్ద రిజర్వేషన్ లేని ప్రయాణికులకు దించేసిన దృశ్యం (పాతచిత్రం)
విశాఖ మీదుగా నడుస్తున్న అన్ని రైళ్లలో స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్లు దాదాపు సమానంగా ఉన్నాయి. కొన్నింటిలో ఏసీ బోగీలు ఎక్కుగా ఉన్నాయి. కోరమండల్, మెయిల్ రైళ్లు దీనికి ఉదాహరణ. స్లీపర్ బోగీలో టికెట్ దొరక్కపోతే థర్డ్ ఏసీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇందులో ఛార్జి స్లీపర్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. ఉదాహరణకు విశాఖ నుంచి విజయవాడకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ ఛార్జీ రూ.270 వరకు ఉండగా, థర్డ్ ఏసీలో అయితే రూ.700 అవుతుంది. స్లీపర్ బోగీలు తగ్గించి, థర్డ్ ఏసీ కోచ్లు పెంచడం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడుతుండగా, రైల్వేకు ఆదాయం పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్