logo

కంటైనర్‌ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

నగరంలోని షీలానగర్‌ సమీపంలోని రెండు కంటైనర్‌ కంపెనీల్లో ఆదాయపన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

Published : 26 Nov 2022 02:32 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంలోని షీలానగర్‌ సమీపంలోని రెండు కంటైనర్‌ కంపెనీల్లో ఆదాయపన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. గత రెండు రోజులుగా రెండు కంపెనీల కార్యాలయాల్లో ఐ.టి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా కంటైనర్లకు సంబంధించి తప్పుడు బిల్లులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుపై ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని