రక్షణ దళాల్లోకి రాచబాట
విద్యార్థి దశలోనే త్రివిధ దళాలపై ఆసక్తిని పెంచుకోవడం, క్రమశిక్షణ, దేశభక్తితో చిరుతల్లా కదిలే యువత ఎన్సీసీ బాట పడుతోంది.
ఎన్సీసీ దినోత్సవం నేడు
కవాతు చేస్తున్న క్యాడెట్లు
పాయకరావుపేట, న్యూస్టుడే: విద్యార్థి దశలోనే త్రివిధ దళాలపై ఆసక్తిని పెంచుకోవడం, క్రమశిక్షణ, దేశభక్తితో చిరుతల్లా కదిలే యువత ఎన్సీసీ బాట పడుతోంది. రక్షణ దళాల్లో చేరాలనుకునే వారంతా దగ్గరి దారిగా దీన్ని ఎంచుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకత చాటుకునేందుకు ఈ శిక్షణ బాటలు వేస్తోంది. ఎన్సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘న్యూస్టుడే’ కథనం.
దేశ రక్షణలో నిమగ్నమై, ఆర్మీ దుస్తుల్లో సగర్వంగా పనిచేేయాలన్న కోరిక యువతను ఉర్రూతలూగించడం సహజమే. యువ సైన్యాన్ని ఆకర్షించేలా చదువుకునే వయసు నుంచే సైన్యంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఎన్సీసీని ఏర్పాటు చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు ప్రతీకగా మూడు రంగులు (ఎరుపు, నేవీ బ్లూ, లైట్బ్లూ)తో ఉన్న జెండాను ఎన్సీసీ క్యాడెట్లు ధరిస్తుంటారు. ఎన్సీసీలో చేరితే ఉన్నత పాఠశాల స్థాయిలో ‘ఎ’, జూనియర్ కళాశాల స్థాయిలో ‘బి’, డిగ్రీ స్థాయిలో ‘సి’ ధ్రువపత్రం అందుకోవచ్చు. ఈఏపీసెట్ తదితర ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఆర్మీలో చేరాలనుకునే వారికి రాత పరీక్ష లేకుండానే దేహ దారుఢ్య పరీక్షలు చేసి నేరుగా అవకాశం కల్పిస్తున్నారు. రిపబ్లిక్ పరేడ్కు హాజరవుతున్నారు. పాయకరావుపేటలోని స్పేసెస్ డిగ్రీ కళాశాలలో యువతీ, యువకులు ఎన్సీసీలో శిక్షణ పొందుతున్నారు. ట్రెక్కింగ్, రైఫిల్ షూటింగు, మార్చ్ఫాస్ట్ల్లో తర్ఫీదు తీసుకుంటున్నారు.
రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనాలనే..
- జి.వి.ఎస్.రమణి, సీహెచ్.హేమలత
రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనాలన్నదే మా లక్ష్యం. చదువులో రాణిస్తూనే శిక్షణ పొందుతున్నాం. సమాజంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఎదుర్కొనే సత్తా అలవడుతోంది. ట్రెక్కింగుకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగ సాధనలో ఎన్సీసీ ఉపయోగపడుతోంది.
సైనిక శిబిరంలో పాల్గొన్నాం
- ఎస్.భాస్కర్, కె.ప్రేమ్చందు, సూర్యనారాయణ
సికింద్రాబాద్లో నిర్వహించిన సైనిక శిబిరంలో పాల్గొన్నాం. అక్కడ ఆయుధాల వినియోగం, సైన్యం చేతిలో ఉన్న అధునాతన ఆయుధ సంపత్తిపై అవగాహన కల్పించారు. చిన్నప్పట్నించి సైన్యంలో చేరాలనే కోరిక ఉంది. దీంతో ఎన్సీసీలో చేరాం. క్రమశిక్షణ అలవాటవుతుంది. సమాజం పట్ల బాధ్యత, సామాజిక సేవ చేయాలనే దృక్పథం మరింత పెరిగింది.
బాలికలూ ఆసక్తి చూపుతున్నారు
- అశ్విని, ఎన్సీసీ కేర్ టేకర్
ఎన్సీసీలో చేరేందుకు బాలికలూ ఆసక్తి చూపుతున్నారు. శిక్షణ తీసుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు. రైఫిల్ షూటింగు, మార్చ్ఫాస్ట్ ఏదైనా ముందంజలో ఉంటున్నారు. దేశభక్తి పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్