భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన శనివారం సాయంత్రం అగనంపూడి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
వరలక్ష్మి (పాతచిత్రం)
అగనంపూడి, న్యూస్టుడే : రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన శనివారం సాయంత్రం అగనంపూడి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. ఎలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన బొడ్డేడ రాము అక్కిరెడ్డిపాలెంలోని విశాఖ డెయిరీలో పని చేస్తూ, సమీప బహుళ అంతస్తు భవనంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. స్వగ్రామానికి వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం భార్య వరలక్ష్మి(38)తో కలిసి స్కూటీపై తిరిగి నగరానికి వస్తున్నారు. అగనంపూడి హనుమాన్ కూడలిలో మలుపు తిరుగుతుండగా రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. దీంతో వాహనంపై కూర్చున్న వరలక్ష్మి బస్సు వెనక చక్రాల కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో రాముకి స్వల్ప గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య విగతజీవిగా మారడంతో రాము తీవ్రంగా రోధించారు. దువ్వాడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్