చూసేదెవరు.. ఆపేదెవరు?!
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. వీటి పరిశీలన... పరిష్కారం ఉన్నతాధికారులకు పెనుసవాలుగా మారింది.
అక్రమ కట్టడాలపై భారీగా ఫిర్యాదులు
టౌన్ప్లానింగ్ విభాగానికి వినతుల వెల్లువ
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. వీటి పరిశీలన... పరిష్కారం ఉన్నతాధికారులకు పెనుసవాలుగా మారింది.
* ఫిర్యాదు అందిన తరువాత కూడా వాటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని కిందిస్థాయి అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ప్రతిసారి ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించి పరిష్కరించాల్సిన ఫిర్యాదులు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ ఫిర్యాదులు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కరించడానికి చాలా సమయం పడుతోంది.
* మరో వైపు కొందరు కిందిస్థాయి ఉద్యోగులు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ‘స్పందన’ కార్యక్రమానికి టౌన్ ప్లానింగ్ విభాగ ఏసీపీలు హాజరుకారు. జోనల్ కార్యాలయాల్లో జరిగే ‘స్పందన’లో పాల్గొంటారు. జీవీఎంసీలో వచ్చిన ఫిర్యాదులను వీరు మళ్లీ తెలుసుకొని ముందుకు సాగాల్సి వస్తోంది. ఈ క్రమంలో జాప్యం జరుగుతోంది.
ఎన్నెన్ని ఫిర్యాదులో..
* భవన నిర్మాణానికి దరఖాస్తు చేస్తే అనుమతులు రావటానికి చాలా రోజులు పడుతోంది.
* దరఖాస్తును పరిశీలించి సవరించుకోవాల్సిన అంశాలుంటే అధికారులు వాటిని చెప్పాలి. అలా సకాలంలో చెప్పడంలేదు.
* అధికారులు సూచించిన విధంగా తప్పిదాలను సవరించినా..అనుమతులకు జాప్యం చేస్తున్నారు.
* నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తి చేసినా ఆక్యుపెన్సీ పత్రాలు ఇవ్వడంలోనూ తాత్సారం జరుగుతోంది.
* నిబంధనలకు విరుద్ధంగా సాగే నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదులు ఇస్తే... ఫిర్యాదుదారుల పేర్లు, వారి ఫోన్ నంబర్లను వాటి యజమానులకు జీవీఎంసీలోని కొందరు చేరవేస్తుండటం గమనార్హం. దీంతో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
* గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని జీవీఎంసీలోని సిబ్బందే బయటకు పంపిస్తున్నారని పలువురు చెబుతున్నారు.
* అక్రమ నిర్మాణమని అధికారులు నిర్ధరించిన తరువాత కూడా యజమానికి అనుకూలంగా.. స్వల్పంగా నిర్మాణాలు తొలగించి ఆ తరువాత ఆపేస్తున్నారనే విమర్శలెన్నో.
* కొన్ని ఫిర్యాదులైతే అసలు ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియదు అన్నట్లు ఉంది.
* ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
* అక్రమంగా నిర్మించిన కొన్ని నిర్మాణాలకు ఇంటి పన్నులు కూడా విధిస్తున్నారు.
* అక్రమ నిర్మాణదారులు కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పి నిర్భీతిగా కట్టేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తే పరిశీలనకు అధికారులు జంకుతున్నారు. కొందరు చిన్నచిన్న నాయకులు కూడా టౌన్ప్లానింగ్ ఉద్యోగులపై ఒత్తిళ్లు తెచ్చి..చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు.
* జీవీఎంసీ ఉద్యోగులు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూశాయి. తమ పలుకుబడిని అడ్డంపెట్టుకుని అధికార దుర్వియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జీవీఎంసీకి వచ్చిన ఫిర్యాదులు: 1,000 (సుమారు)
అధిక ఫిర్యాదుల్లో టౌన్ప్లానింగ్ విభాగం స్థానం: 2
కఠిన చర్యలు తప్పవు..
-పి.రాజాబాబు, కమిషనర్, జీవీఎంసీ
భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. అలాంటి ఫిర్యాదులను సమగ్రంగా అధ్యయనం చేసి బాధితుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రత్యేకంగా టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ రోజు టౌన్ప్లానింగ్ విభాగానికి చెందిన ఏసీపీలు కూడా హాజరవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన