షబ్నమ్ బాట.. అమ్మాయిల ఆట
మహిళల క్రికెట్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఈ క్రీడలోకి వచ్చే బాలికల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
క్రికెట్లో దూసుకెళ్తున్ననగర బాలికలు
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: మహిళల క్రికెట్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఈ క్రీడలోకి వచ్చే బాలికల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్ ఫీజులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించడంతో వారిలో మరింత ఉత్సాహం వచ్చింది. విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ అండర్-19 భారత మహిళల జట్టులో చోటు సంపాదించడంతో జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారిణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆమెలా తాము కూడా భారత జట్టుకు ఎంపిక కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వీడీసీఏ నుంచి ప్రోత్సాహం
మహిళల క్రికెట్కు జిల్లా క్రికెట్ సంఘం నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ-బి మైదానంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. నిత్యం సాధన చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఫలితంగా షబ్నమ్ లాంటి క్రీడాకారిణి భారత జట్టుకు ఎంపికైంది. అండర్-10, 12, 14, 16, 18లతో పాటు సీనియర్ గ్రూపుల్లోనూ జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నగరంలో సుమారు 100మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. అండర్-19 రాష్ట్ర జట్టులో సభ్యుల ప్రతిభను ఇక్కడ చూడొచ్చు.
క్షణంలో బెయిల్స్ పడేస్తుంది..
వై.హేమరోషిణి వికెట్ కీపర్గా రాణిస్తోంది. ఆమె చేతిలో బాలు ఉంటే ప్రత్యర్థి బ్యాటర్ ఫ్రంట్ ఫుట్కు వెళ్లే సాహసం చేయదంటే అతిశయోక్తి కాదు. కన్నుమూసి తెరిచేలోపు బెయిల్స్ను ఎగరేయడంలో రోషిణిది అందెవేసిన చేయి. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్లో రెండు స్టంపవుట్లకు తక్కువు కాకుండా చేసింది. మరో వైపు బ్యాటింగ్లోను అదరగొడుతూ జట్టుకు మంచి స్కోరు సాధించి పెడుతోంది. షబ్నమ్ ఎంపిక ఆమెలో మరింత ఉత్సాహం పెంచింది. మున్ముందు భారత జట్టుకు వికెట్ కీపర్గా సేవలందించాలనే పట్టుదలతో సాధన చేస్తోంది.
ఓపెనర్గా రాణిస్తూ..
పెందుర్తికి చెందిన కె.మహంతిశ్రీ ఓపెనర్ బ్యాటర్గా రాణిస్తోంది. జట్టుకు శుభారంభం అందించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. మంచి బ్యాటింగ్ శైలితో అద్భుతమైన షాట్లు కొడుతూ ప్రశంసలు అందుకుంటోంది. టీ-20 మ్యాచ్లు, ఛాలెంజర్ ట్రోఫీలోనూ సత్తా చాటింది. ఈ ఏడాది అక్టోబరులో చెన్నై, అహ్మదాబాద్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు అర్ధ శతకాలు సాధించింది. భవిష్యత్లో దేశం గర్వపడే బ్యాటర్గా పేరు తెచ్చుకోవాలని తపిస్తోంది.
బంతిని గిరగిరా తిప్పుతూ..
పీఎంపాలేనికి చెందిన విన్నీ సుజాన్ ఎడమచేతి స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థి జట్లను గడగడలాడిస్తోంది. బంతిని గిరగిరా తిప్పుతూ వికెట్లు పడగొడుతోంది. గత నెలలో చెన్నైలో జరిగిన అండర్-19 టీ-20 మ్యాచ్ల్లో ఏడింటిలో ఆడి 11 వికెట్లు తీసింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయి మ్యాచ్ల్లో వంద వరకు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. షబ్నమ్ స్ఫూర్తితో భవిష్యత్లో భారత జట్టులో చోటు సంపాదించి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
వికెట్లను వేటాడుతూ..
పీఎంపాలేనికి చెందిన బి.తన్మయ్ బౌలింగ్లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు అండర్-19 టీ-20 మ్యాచ్లు ఏడు ఆడి 12 వికెట్లు తీసింది. ఆమె ప్రతిభకు ఉన్నత స్థానం దక్కింది. ప్రస్తుత అండర్-19 రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తోంది. మంగళగిరిలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. అక్కడ బౌలింగ్పై మరింత దృష్టి కేంద్రీకరించి కోచ్ల శిక్షణలో కఠోరంగా శ్రమిస్తోంది. భవిష్యత్లో భారత జట్టులో చోటు సంపాదించి అత్యుత్తమ బౌలర్గా నిలవాలనే లక్ష్యంతో తన్మయ్ ముందుకు సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య