Vizag: విశాఖలో భూ దోపిడీపై వైకాపా, తెదేపా చర్చకు రావాలి: జీవీఎల్ సవాల్
పోలవరం ప్రాజెక్టు మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని చెప్పారు.
విశాఖపట్నం: వైకాపా, భాజపా మధ్య రాజ్యాంగబద్ధ సంబంధాలే ఉన్నాయని.. అంతకుమించి ఏమీ లేదని ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. వైకాపాకు భవిష్యత్తులో ప్రత్యామ్నాయం అవ్వాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా భాజపా, జనసేనలే నిలబడతాయని చెప్పారు. పోలవరం మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలకుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
విశాఖలో భారీగా భూములు దోచేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. దీనిపై వైకాపా, తెదేపా నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటుపడ్డాయని.. రిజర్వాయర్లకు కనీస మరమ్మతులు జరగలేదన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి విశాఖకు 5జీ సేవలు వస్తాయని వెల్లడించారు. విశాఖ నుంచి 3 వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు. విశాఖ నుంచి తిరుపతి, హైదరాబాద్, బెంగళూరుకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నిర్వహణ ఖర్చులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థే ఖర్చు పెట్టిందని తెలిపారు. దీనికి కూడా ఎవరైనా స్టిక్కర్ వేసుకుంటే అది కచ్చితంగా దుస్సాహసమే అవుతుందని జీవీఎల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?