ధాన్యం కొనేదెప్పుడు సారూ!
పెదబొడ్డేపల్లికి చెందిన రైతు అప్పారావు రెండు రోజుల క్రితం ధాన్యం నూర్చారు. అవసరమైన గోనె సంచుల కోసం రైతుభరోసా కేంద్రానికి వచ్చారు
యాప్ వచ్చాకేఅంటున్న సిబ్బంది
ఆర్బీకేలకు చేరని గోనె సంచులు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే
పెదబొడ్డేపల్లికి చెందిన రైతు అప్పారావు రెండు రోజుల క్రితం ధాన్యం నూర్చారు. అవసరమైన గోనె సంచుల కోసం రైతుభరోసా కేంద్రానికి వచ్చారు. సంచులు ఇంకా జిల్లాకేంద్రం నుంచి రాలేదని అక్కడి సిబ్బంది స్పష్టంచేశారు. ఏవో తంటాలు పడి నూర్చిన ధాన్యాన్ని బస్తాలకెత్తుకుంటాం... కల్లానికి ఎప్పుడొచ్చి నాణ్యత పరిశీలిస్తారని ఆ రైతు ప్రశ్నించారు. యాప్ అందుబాటులోకి రాలేదు. ఆదొచ్చే దాకా కొనుగోళ్లకు వీలుకాదనడంతో... చేసేది లేక వ్యయ, ప్రయాసల కోర్చి ధాన్యాన్ని ఇంటికి చేర్చారు
..యాప్ ఎప్పుడు తెరుస్తారా?, ఇంట్లోని నిల్వలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని రైతు ఎదురు చూస్తున్నారు.
...అప్పారావు ఒక్కరే కాదు... ధాన్యం నూర్పిళ్లు చేసి రైతులందరిదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే కొన్ని రకాలు కోతకొచ్చాయి. చాలాచోట్ల కోతలు పూర్తయ్యి కుప్పలేసి నిల్వ చేసుకుంటున్నారు. కొందరు నూర్చేసి అమ్మకాలకు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నాతవరం, దేవరాపల్లి, మాడుగుల మండలాలకు మాత్రమే లక్ష గోనె సంచులను జిల్లా కేంద్రం నుంచి పంపారు. మిగిలిన మండలాలకు పంపాల్సి ఉంది. ఈనెల మూడో తేదీ నుంచి కొనుగోళ్లు ఉంటాయన్న సమాచారంతో చాలామంది రైతులు శనివారం కొనుగోలు కేంద్రాలకు వచ్చారు. యాప్ అందుబాటులోకి రాలేదని, ఎప్పుడోస్తుందో సమాచారం లేదని సిబ్బంది చెప్పడంతో తమ ఫోన్ నంబర్లు ఇచ్చి నిరాశతో తిరుగుముఖం పట్టారు.
నిబంధనలు ఇవీ...
* ఈ-క్రాప్ నమోదు చేసుకుని ఈకేవైసీ పూర్తయిన రైతులు ధాన్యం విక్రయాలకు సిద్ధంగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. వ్యర్థ పదార్థాలు, రంగు మారిన, కుంచించుకుపోయిన, తక్కువశ్రేణి గింజలు, తేమ తదితర నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటేనే కొనుగోలు చేస్తారు.
* రైతులు ధాన్యం విక్రయించిన తరువాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. 21 రోజుల్లో రైతు ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
* రైతు భరోసా కేంద్రం నిర్దేశించిన నాణ్యత ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వమే సంచులివ్వాలి
ఐదెకరాల్లో వరి వేశా. రెండు ఎకరాల పంట నూర్చి ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకున్నాం. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగులు పాడు చేస్తాయి. పంట అన్నిచోట్లా కోతకువచ్చింది. ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని రైతులంతా చూస్తున్నారు. వెంటనే గోనె సంచులు అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించే ధర తక్కువగా ఉంటోంది. ప్రభుత్వమే సరఫరా చేస్తే రైతుకు మేలు.
మతల అప్పారావు, రైతు, పెదబొడ్డేపల్లి
ఎనిమిది నుంచి కొనుగోళ్లు
ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. జిల్లాలో 32వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా తీసుకున్నాం. ఇప్పటికే మూడు మండలాలకు గోనె సంచులు పంపాం. మిగతా మండలాలకు పంపిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడే విధంగా ధాన్యాన్ని మెరుగుపరిచి సిద్ధం చేసుకోవాలి. కనీస మద్దతు ధర వంద కేజీల ఏ గ్రేడ్ రకాలకు రూ.2060, సాధారణ రకాలకు రూ.2040 చెల్లిస్తారు. విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్ఫ్రీ 1902, 155251 నంబర్లను సంప్రదించొచ్చు.
ఎం.శ్రీలత, పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు