ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో... అనర్హులు?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
న్యూస్టుడే, వన్టౌన్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ముసాయిదా ఓటర్ల జాబితాల్లో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సీపీఎం నేతలు ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు ఫిర్యాదు చేశారు. మరో పక్క ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇదే సమయంలో పేర్లు నమోదు చేసుకోకుండా ఉండిపోయిన అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంది.
క్షేత్రస్థాయిలో చురుగ్గా పరిశీలన
* 2019కు ముందు డిగ్రీ ఉతీర్ణులైన వారు మాత్రమే ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుకు జత చేసిన డిగ్రీ ధ్రువపత్రాలపై గజిటెడ్ అధికారి సంతకం చేసిన వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిర్దేశిత నిబంధన ఉల్లంఘించారని, 2019 తర్వాత డిగ్రీ ఉతీర్ణులైన వారి పేర్లను సైతం ఓటరు జాబితాలో చేర్చారని ఫిర్యాదులు వచ్చాయి.
* ఉత్తరాంధ్ర పరిధిలో ఆరు జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఓటరు జాబితాల తయారీ కోసం నియమితులైన ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి), ఏఈఆర్ఓల (అదనపు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి) ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వారీ ఓటరు జాబితాల పరిశీలన చేపట్టారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించిందీ లేనిదీ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా ఓటర్లపై అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. డబుల్ ఎంట్రీలను తొలగిస్తున్నారు. అభ్యంతరాలపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పిదాలు ఉంటే ఆయా పేర్లను తొలగిస్తున్నారు.
పునః నమోదుకు 11వేల దరఖాస్తులు
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఉత్తరాంధ్రలో 2,43,903 మంది పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. మళ్లీ పేర్ల నమోదుకు ఇంత వరకు 11వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటి విచారణ కూడా చేపట్టారు.
* అభ్యంతరాలతో పాటు సుమోటోగా కూడా ముసాయిదా ఓటరు జాబితాలపై విచారణ చేస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. తమ దృష్టికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక వేళ జాబితాల్లో ఎక్కడైనా తప్పిదాలు ఉంటే అభ్యంతరం తెలుపుతూ పౌరులు దరఖాస్తు చేయవచ్చునని సూచించారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా జాబితాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు ఇలా..జిల్లా ఓటర్లు
శ్రీకాకుళం 46,119
విజయనగరం 54,466
పార్వతీపురం 17,052
అల్లూరిజిల్లా 10,200
విశాఖపట్నం 80,105
అనకాపల్లి 35,961
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు