logo

41 మంది ప్రధానోపాధ్యాయులకు శ్రీముఖాలు

ప్రతిరోజు విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఉదయం 10.30 గంటలలోపు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్‌ 2, 3వ తేదీల్లో విశాఖ జిల్లాలో హాజరు నమోదు చేయని 41 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ శ్రీముఖాలు జారీచేశారు.

Published : 04 Dec 2022 05:28 IST

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : ప్రతిరోజు విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఉదయం 10.30 గంటలలోపు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్‌ 2, 3వ తేదీల్లో విశాఖ జిల్లాలో హాజరు నమోదు చేయని 41 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్‌.చంద్రకళ శ్రీముఖాలు జారీచేశారు. వీరంతా నోటిసు అందుకున్న ఒకరోజు లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అందులో 37 ప్రైవేటు పాఠశాలలు కాగా కేవలం నాలుగు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు కావటం విశేషం. వీటిలో చాలా పాఠశాలలు రెండు రోజులు నమోదు చేయకపోగా కొన్ని ఒక రోజు మాత్రమే నమోదు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని