మురుగునీటి శుద్ధికి మరో మూడేళ్లు..!
విశాఖ నగర శివారు పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీవీఎస్సీసీఎల్) చేపట్టిన యూజీడీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గడువు సమీపిస్తోంది.
ఎస్టీపీ నిర్మాణంలో జాప్యం
న్యూస్టుడే, కార్పొరేషన్
నరవ వద్ద నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం
విశాఖ నగర శివారు పెందుర్తి, గాజువాక ప్రాంతాలలో గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీవీఎస్సీసీఎల్) చేపట్టిన యూజీడీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి గడువు సమీపిస్తోంది. పెందురి ప్రాజెక్టుకు మరో 24 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇళ్ల వరకు వడివడిగా పైపులైన్లు వేస్తున్నారు. అయితే నరవ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇళ్లకు ఇప్పుడిప్పుడే కనెక్షన్లు ఇచ్చే దాఖలాలు కనిపించడం లేదు. యూజీడీ (భూగర్భ మురుగునీటి వ్యవస్థ) పైపులైన్లు నరవలోని ఎస్టీపీకి చేరాల్సి ఉంది. ఈ పైపులైన్లు రెండు ప్రాంతాలలో రైల్వేలైన్లు దాటాల్సి ఉండగా ఆయా పనులు ప్రారంభమే కాలేదు.
* జేఎన్ఎన్యూఆర్ఎం (జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం) నిధులతో నరవలో 105 ఎంఎల్డీల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం ప్రతిపాదించారు. 75 ఎంఎల్డీ సామర్థ్యం గల ఒక ఎస్టీపీ అందుబాటులోకి వచ్చింది. 75 ఎంఎల్డీ సామర్థ్యం గల మరో ఎస్టీపీ నిర్మాణంతోపాటు టెర్షరి ట్రీట్మెంట్(మూడు దశల శుద్ధి) చేసే యంత్రాలు సమకూర్చుకోవాల్సి ఉంది. ఆయా పనులు జరగాలంటే మరో రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయి.
రెండు ప్యాకేజీలుగా ప్రాజెక్టు
* గాజువాక పరిసరాలు, మల్కాపురం, పెందుర్తి ప్రాంతాల్లో రూ.905కోట్ల వ్యయంతో యూజీడీ నిర్మాణం చేపట్టారు. వ్యయ భారమంతా జీవీఎంసీ భరించి మురుగు నీటిని శుద్ధి చేయగా వచ్చే నీటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్టీల్ప్లాంటు, హెచ్పీసీఎల్తో జీవీఎస్సీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.309.94కోట్లతో పెందుర్తి ప్రాంతంలో.., రెండో ప్యాకేజీగా రూ. 411 కోట్ల వ్యయంతో గాజువాకలో యూజీడీ నిర్మాణం చేపట్టారు. పెందుర్తిలో పనులు చురుగ్గానే జరుగుతున్నా, గాజువాకలో గుత్తేదారు సంస్థకు నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
* పెందుర్తిలో 15వేల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 6వేల ఇళ్ల వరకు పైపులైన్లు వేశారు. గాజువాకలో 45 వేల కనెక్షన్లకు గాను 5056 ఇళ్ల వరకు పైపులైను వేయగలిగారు. గాజువాక ప్యాకేజీకి గడువు వచ్చే ఏడాది జులై వరకు ఉంటుందని ఇంజినీరింగ్ అధికారి ఒకరు తెలిపారు. రెండు ప్యాకేజీలు పూర్తయి, నీటిని శుద్ధి చేసి విక్రయించడానికి మరో మూడేళ్లు పట్టే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ