కంచేసి.. పంచేసుకున్నారు!!
ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికాకుండా చూడాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో అంతులేని ఉదాసీనత చూపుతున్నారు.
భూములు ఆక్రమించినా పట్టించుకోని యంత్రాంగం
ఇదేం మాయో...అధికారులకెంత దయో!!
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే, పరవాడ
వివాదాస్పద భూముల చుట్టూ ఏర్పాటు చేసిన కంచె
ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికాకుండా చూడాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో అంతులేని ఉదాసీనత చూపుతున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన సర్కారు భూములు ఆక్రమణదారుల గుప్పిట నుంచి బయటపడలేకపోతున్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో వందల కోట్ల విలువ చేసే 50 ఎకరాల పైగా ప్రభుత్వ భూములను కొందరు అడ్డగోలుగా దక్కించుకున్నారని తెలుస్తున్నా కనీస చర్యలు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.
పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని ప్రభుత్వ భూములను స్థానికుడొకరు పక్కా ప్రణాళికతో తన కుటుంబీకుల పరం చేసుకున్నాడు. వివరాలు పరిశీలిస్తే వారి పేర్లే ఆన్లైన్లో కనిపిస్తాయి. అంతలా వ్యూహాత్మకంగా రికార్డుల్లో మాయాజాలం జరిగింది. కొన్ని భూములను బినామీ పేర్లతో దక్కించుకున్నాడు. వాటిలో కొబ్బరి, అరటి తోటలు సాగు చేస్తున్నాడు. కొన్ని భూములు లీజుకు ఇచ్చాడు. ఈ భూముల చుట్టూ సిమెంట్ స్తంభాలతో, ఇనుప తీగలతో రక్షణ కంచె ఏర్పాటు చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన కొందరు ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ మూడేళ్ల క్రితమే సిట్కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి 16 ఎకరాలపై ఎలాంటి వ్యవహారాలు జరగకుండా వెబ్ల్యాండ్లో హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత స్పందనలో ఫిర్యాదుల మేరకు స్థానిక తహసిల్దార్తో విచారణ చేయించారు. సుమారు 44 ఎకరాల ప్రభుత్వ భూములు ప్రస్తుత అనుభవదారులకు ఎలా దఖలుపడ్డాయో సరైన ఆధారాలు లేవు. దీంతో వారికి జారీ చేసిన పట్టాలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని విచారణాధికారి సూచించారు.
అయినా రెవెన్యూ అధికారులు ఆ భూముల వైపే చూడటం లేదు. ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లే కారణమని సమాచారం.
పరిరక్షణపై కాలయాపన
హోల్డ్లో పెట్టిన భూములపైనా అధికారులు వాస్తవాలు వెల్లడించటం లేదు. అక్రమార్కులు అడ్డగోలుగా తమ పరం చేసుకున్నారని విచారణలో తేలిన వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవటానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా చోట్ల ఇవి ప్రభుత్వ భూములని బోర్డులైనా పెట్టాలి. అధికారులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు. మరోసారి విచారణ చేయిస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై తహసిల్దారు ప్రకాశరావు వద్ద ప్రస్తావించగా నిధులు సమకూర్చుకొని ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టే చర్యలు తీసుకుంటామని వివరించారు.
పేర్లలో తిరకాసు
* ఒక సర్వే నంబరులో మూడు ఎకరాలకు సంబంధించి ఫసలీలో ఒక పేరు, డీఫాం రిజిస్టర్లో మరో పేరు, వన్బీలో ఇంకో పేరు ఉంది.
* 4.60 ఎకరాలకు సంబంధించి ఫసలీలో ఎవరి పేరు లేకున్నా...డీఫాం, వన్బీ రికార్డుల్లో మాత్రం రామారావు పేరుంది.
* 2.35 ఎకరాలకు ఫసలీ, డీఫాం దస్త్రాల్లో ఒకపేరుంటే...వన్బీ లో మాత్రం ఇంకో పేరు కనిపిస్తోంది.
* ఒక సర్వే నంబరులో మూలయ్య పేరిట 2 ఎకరాలు, మహాలక్ష్మి పేరిట 1.78 ఎకరాలు ఫసలీలో ఉన్నాయి. ఆన్లైన్లో మాత్రం మూలయ్య పేరిటే మొత్తం భూమి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి