Vizag: ఈ దారుణం.. భయానకం!
మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముక్కలుగా మహిళ మృతదేహం
వాసన రాకుండా సంచుల్లో ప్యాకింగ్
పోలీసుల అదుపులో నిందితుడు?
వికలాంగుల కాలనీలో హత్య జరిగిన ఇంటి వద్ద పరిశీలిస్తున్న పోలీసులు
ఈనాడు, విశాఖపట్నం, పీఎంపాలెం, న్యూస్టుడే: మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి... ఏమాత్రం వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలోని శ్రద్ధావాకర్ హత్య కేసును తలపించేలా ఉన్న ఈ ఘటనలో నిందితులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో కుక్కి భారీ ప్లాస్టిక్ డ్రమ్ములో భద్రపరచినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దెకు ఉంటున్న వారి సామగ్రి తీసేసి ఇల్లు ఖాళీ చేయించేందుకు యజమాని వచ్చినప్పుడు ఈ గుట్టు రట్టయింది. ఇంటి యజమాని రాకుంటే మృతదేహం పూర్తిగా కుళ్లిన తరువాత ప్లాస్టిక్ సంచులను ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టాలని నిందితులు ప్రణాళిక వేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రుషి (40) పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రుషి స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట. అతను అద్దెకు ఉన్న ఇంట్లో లభించిన మృతదేహం ఎవరిదన్న విషయాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచారు. నిందితుడికి సహకరించిన వ్యకులెవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను రాబడుతున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్లిన స్థితికి చేరిన శరీర భాగాలను శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్కు పంపించారు. ఆ నివేదికను విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనేనా..?
రుషికి, హత్యకు గురైన మహిళకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమైనా విభేదాలు వచ్చాయేమోనన్న కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎండాడలో వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్న ఇంటి యజమాని రమేష్ వికలాంగుల కాలనీలోని తన ఇంటి (రేకుల షెడ్డు)ని 2019లో రుషి కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా రుషి వెల్డింగ్ పనులకు సహాయకుడిగా రమేష్ వద్దే పనికి కుదిరాడు. రెండు నెలలు చేశాక మానేశాడు. ఈ నేపథ్యంలో రెండు, మూడు నెలలకోసారి అద్దె చెల్లించేవాడు. రమేష్ అనారోగ్యం పాలై ఏడాదికి పైగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలాకాలంపాటు రుషి అద్దె చెల్లించలేదు. దాదాపు ఏడాది నుంచి ఆ ఇంట్లో ఉండకపోయినా ఖాళీ చేయలేదు. రమేశ్ ఫోన్ చేసి అద్దె అడిగినపుడు.. నేడు, రేపు అంటూ చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన రమేశ్ ఆదివారం ఇల్లు ఖాళీ చేయించి వేరొకరికి అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయంతో తన కుటుంబంతో వచ్చి సామాన్లు బయట వేస్తుండగా ఈ ఘటన వెలుగుచూసింది.
వేలిముద్రల సేకరణ
హత్య జరిగిన నివాసంలో క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు అయిదు బృందాలుగా నగరంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. అతని కాల్డేటాను పరిశీలిస్తున్నారు. రుషి తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో కొన్ని నెలలుగా ఉండడం లేదు. దీంతో ఆయన ప్రస్తుత నివాసానికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టారు. మృతదేహం లభ్యమైన ఇంటి యజమాని చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వేర్వేరు కోణాల్లో పోలీసుల ఆరా: మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి... ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో...మహిళ ఎవరన్నది గుర్తించడానికి పోలీసులు ఇబ్బందిపడ్డారు. తలభాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. మృతదేహం అంతగా కుళ్లిపోయినా పరిసర ప్రాంతాల వారికి ఏమాత్రం వాసన రాలేదు. ప్లాస్టిక్ సంచుల్లో కుక్కినా... కొద్దిరోజులకు ఎంతో కొంత వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం వాసన రాకుండా నిందితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయా అంశాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇటీవల వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కోణంలోనూ ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?