గుప్పు గుప్పు ఎక్కువే... చిక్కేది తక్కువే!!
గత రెండు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో చిక్కిన గంజాయి నిందితుల జాబితా ఇది.. అయితే 5 కేజీల లోపు సరకు మాత్రమే దొరుకుతోంది. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా మైదాన ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతోంది.
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
గత రెండు నెలల కాలంలో అనకాపల్లి జిల్లాలో చిక్కిన గంజాయి నిందితుల జాబితా ఇది.. అయితే 5 కేజీల లోపు సరకు మాత్రమే దొరుకుతోంది. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా మైదాన ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతోంది.
* డిసెంబరు 1న అనకాపల్లి జిల్లా మాకవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పరిశీలించగా నాలుగు కేజీల గంజాయి దొరికింది.
* నవంబరు 28: రోలుగుంట మండలం నిండుగొండ గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకులపై వస్తున్న ఇద్దరు
6 కేజీల గంజాయితో పోలీసులకు చిక్కారు.
* నవంబరు 24: నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మధ్యప్రదేశ్కి చెందిన సురేష్ సేన్ అనే వ్యక్తిని తనిఖీ చేసి కేజీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
* నవంబరు22: రోలుగుంట మండలం రొంగలపాలెం వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 126 కేజీల గంజాయి దొరికింది.
* నవంబరు21: పాయకరావుపేట మండలం తాండవ కూడలి వద్ద అనుమానాస్పద వ్యక్తుల నుంచి 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* నవంబరు 15 : నర్సీపట్నంలో రెసిడెన్సీలో 4 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్చేశారు.
* నవంబరు10: నక్కపల్లిలోని కాగిత టోల్ ప్లాజా వద్ద వ్యానులో తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పట్టుకుని ఐదుగురిని పోలీసులు అరెస్ట్చేశారు.
జాతీయ నేర గణాంకాల్లో గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాలో అగ్రస్థానంలో ఉందని తేలింది. అయితే పోలీసులు పట్టుకుంటున్నది గోరంత, తరలిపోతుంది కొండంత అన్న చందంగా మారింది. గంజాయి, నాటుసారా అరికట్టే చర్యల్లో భాగంగా శాంతిభద్రతల విభాగంతో పాటుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సిబ్బంది నిఘా పెడుతున్నామని చెబుతున్నా.. పెద్దఎత్తున రవాణా జరుగుతూనే ఉంది.
* అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలోని డీ ఎడిక్షన్ సెంటర్కి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత సిగరెట్లకు బానిసవుతున్నారు. కొంతమంది సిగరెట్లలో గంజాయి పెట్టి తాగుతున్నట్లు తేలింది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితికి దారి తీస్తుందని పలువురు భయాందోళనలు చెందుతున్నారు.
* అనకాపల్లి జిల్లా కేంద్రంలో గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారుచేసి అమ్మకాలు చేస్తున్న వ్యక్తులను ఆ మధ్య కాలంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి గంజాయి తాగడానికి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
* అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఒక హత్యకు గంజాయి తాగడమే ప్రధాన కారణమని తేలింది.
* నర్సీపట్నంలో ఓ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు గంజాయికి బానిస అని పోలీసులు తేల్చారు.
ఇలా మత్తు కోసం గంజాయి వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. గంజాయి సులభంగా దొరకడంతో దీన్ని తాగి మత్తుకు బానిసలవుతున్నారు.
అనకాపల్లిలో గంజాయి నిల్వలను దహనం చేస్తున్న అప్పటి డీజీపీ సవాంగ్
నిఘా పెంచుతున్నా తరలిపోతున్న గంజాయి
విజిబుల్ పోలీసింగ్ పేరుతో పోలీసులు నిఘా పెంచుతున్నారు. అయినా గంజాయి తరలించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి ఎక్కడ పండిస్తున్నది?, ఎలా తరలిస్తున్నారనే సమాచారం పోలీసుల వద్ద పక్కాగా ఉండేది. జిల్లాల పునర్విభజన జరిగాక ఎవరి హద్దులు వారివే అన్నట్లుగా
పరిస్థితి మారింది. దీంతో పెద్ద మొత్తంలో గంజాయి తరలించే సమాచారం పోలీసులకు అందడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పర్యటకుల ముసుగులో గంజాయి తరలించే వారిని తనిఖీ చేసే వ్యవస్థ లేదు. అయితే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడంలో చొరవచూపిన ఎస్సైలు, సిబ్బందికి ఎస్పీ గౌతమి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
మత్తుతో జీవితాలు నాశనం : సరదాగా సిగరెట్టు, బీడీల్లో గంజాయి పెట్టి తాగడం ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తుంది. యువతలో దీన్ని తగ్గించేందుకు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో కౌన్సిలింగ్ చేసి మందులిస్తున్నాం. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కింద ఇలాంటి వారికి చికిత్స ఇవ్వొచ్చు. జిల్లా ఆసుపత్రికి వచ్చిన వారికి అందించిన చికిత్స, మందులతో చాలామంది అలవాటు మానేశారు.
కాపు శ్యామల, సైకాలజిస్టు, జిల్లా ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి