తనిఖీలకు తాత్సారమెందుకు?
నాతవరం మండలం లేటరైట్ క్వారీని సంయుక్త కమిటీతో తనిఖీ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది.
లేటరైట్ క్వారీపై వారంలో నివేదికివ్వండి: ఎన్జీటీ
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
బమిడికిలొద్ది లేటరైట్ క్వారీ ప్రాంతం
నాతవరం మండలం లేటరైట్ క్వారీని సంయుక్త కమిటీతో తనిఖీ చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని బమిడికలొద్దిలోని ఓ కొండ పైభాగాన 120 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ క్వారీ ఉంది. కొయ్యూరు మండలానికి చెందిన జర్తా లక్ష్మణరావు ఈ క్వారీని లీజుకు తీసుకున్నా నిర్వహణ మొత్తం అధికార పార్టీ పెద్దలే చేపడుతున్నారు. ఇక్కడి లేటరైట్ తరలించడానికి అవసరమైన రహదారి నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉపాధి నిధులతో రోడ్డు నిర్మించారు. సాగునీటి వనరులను కప్పేశారు.. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతుల ప్రాణాలకు ముప్పుతెచ్చారు. తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డలను కలుషితం చేశారు. ఈ తవ్వకాలపై దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కోండ్రు మరిడియ్య లేటరైట్ తవ్వకాలను నిలువరించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులతో ఓ సంయుక్త కమిటీని వేసి క్వారిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జిల్లాల పునర్విభజనకు ముందే విశాఖ కలెక్టర్ మల్లికార్జునతో పాటు మరికొందరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నివేదికను ఇచ్చారు. అయితే లేటరైట్ ఉన్న ప్రాంతం నర్సీపట్నం అటవీశాఖ పరిధిలో ఉంటే కమిటీలో విశాఖపట్నం డీఎఫ్వోను నియమించారు. దీనిపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త కమిటీని నియమించి క్వారీని తనిఖీ చేయాలని ఇటీవల ఎన్జీటీ ఆదేశించింది. తాజాగా సోమవారం జరిగిన విచారణలో గత ఆదేశాల ప్రకారం వారంలో సంయుక్త కమిటీ తనిఖీ చేపడుతుందని ప్రభుత్వం తరఫున న్యాయవాది వివరించారు.
కేసు విచారణలో ఉన్నా తరలింపు
లేటరైట్ క్వారీ వల్ల పర్యావరణ నష్టంతో పాటు అనుమతుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, రక్షిత అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారని ఫిర్యాదుదారుడు వాదిస్తున్నారు. మేం అన్ని అనుమతులు తీసుకున్నాం.. నిబంధనల మేరకే తవ్వుకుంటున్నామని లీజుదారుడి తరఫున అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ వివాదాస్పద క్వారీపై గత కొంత కాలంగా ఎన్జీటీలో విచారణ కొనసాగుతోంది. అయితే ఎన్జీటీ క్వారీని పరిశీలించాలని సూచించిందే తప్ప తవ్వకాలు నిలిపేయాలని చెప్పలేదంటూ లేటరైట్ను జోరుగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు లక్షన్నర టన్నులు అధికారికంగా తరలించారు. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఇక్కడ లేటరైట్లో ఎక్కువ భాగం భారతీ సిమెంటు కంపెనీలకే తరలిపోతోంది. అందుకే ఇక్కడ ఎంత మేర తవ్వకాలు జరుగుతున్నాయి?, ఎంత తరలిస్తున్నారని తనిఖీలు చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. ఈ విషయమై అనకాపల్లి గనులశాఖ ఏడీ సుబ్బారాయుడు వద్ద ప్రస్తావించగా గతంలో పర్మిట్లు తీసుకునే తరలించారని చెప్పారు. గత రెండు నెలలుగా పర్మిట్లు తీసుకోలేదని, ప్రస్తుతం లేటరైట్ తరలిస్తున్నట్లు సమాచారం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..