మన్యంలో ఇప్పటికీ నాటు వైద్యమే!!
శ్యామల ఏయూలో ఎమ్మెస్సీ అనంతరం 1996లో పీహెచ్డీలో సీటు సాధించారు. అదే సమయంలో ఎంపీడీవోగా కూడా ఉద్యోగం రావడంతో పీహెచ్డీ చేయలేకపోయారు.
వాల్మీకి తెగలో 80 మంది వైద్యులు
ఈనాడు, విశాఖపట్నం
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నాటు వైద్యులకు నేటికీ విశేష ఆదరణ లభిస్తోందని ఆంధ్రవిశ్వవిద్యాలయ పరిశోధకురాలి పరిశోధనల్లో తేలింది.
ఈ కుటుంబాల్లోని పెద్దలు తరతరాలుగా తమ వారసులకు వైద్య విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. వీరి ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నారు.
విశాఖకు చెందిన తాసుపల్లి శ్యామల ఏయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య ఎస్.బి.పడాల్ పర్యవేక్షణలో పరిశోధనలు చేసి ఆసక్తికర విశేషాలను వెలుగులోకి తెచ్చారు.
శ్యామల
శ్యామల ఏయూలో ఎమ్మెస్సీ అనంతరం 1996లో పీహెచ్డీలో సీటు సాధించారు. అదే సమయంలో ఎంపీడీవోగా కూడా ఉద్యోగం రావడంతో పీహెచ్డీ చేయలేకపోయారు. వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేయాలన్న ఉద్దేశంతో 2014లో పార్ట్టైమ్ పరిశోధకురాలిగా చేరారు. వృక్షశాస్త్ర నైపుణ్యాలతో గిరిజన నాటు వైద్యులు ఏ విధంగా వైద్యం చేయగలుగుతున్నారన్న అంశాలపై విస్తృతంగా పరిశీలన చేశారు. పెదబయలు, ముంచింగుపుట్టు, అరకు, పాడేరు, అనంతగిరి, చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల తదితర ప్రాంతాలతోపాటు, సమీప గిరిజన తండాలలో పర్యటించారు. ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో నాటు వైద్యం చేస్తున్న వారితో మాట్లాడి పలు ఆసక్తికర వివరాలు రాబట్టారు.
* గిరిజన ప్రాంతాల్లో నాటు వైద్యం చేస్తున్న వారిలో అత్యధికులు వాల్మీకి తెగవారే. వీరి సంఖ్య దాదాపు 80 వరకూ ఉంటుంది. ‘క్వాంటిటేటివ్ స్టడీస్ ఆన్ ఇథనో మెడిసినల్ ప్లాంట్స్ యూజ్డ్ బై వాల్మీకి ట్రైబ్స్ ఇన్ పాడేరు’ అనే పరిశోధన గ్రంథాన్ని తయారు చేశారు.
* వృక్షాలు, మొక్కలకు చెందిన వేర్లు, ఆకులు, కాండం, తదితర 25 భాగాలతో వారు పలు రకాల మందులను తయారుచేస్తున్నారు.
* తమ వైద్యానికి 237 జాతుల మొక్కలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాటితో 93 రకాల వ్యాధులకు చక్కటి వైద్యం చేయగలుగుతున్నారు. ఆ విషయాల నిర్ధరణకు నాటు వైద్యుల వద్దకు వచ్చిన వారితో మాట్లాడి... వైద్యం పూర్తైన తరువాత ఆ రోగుల ఇళ్లకు వెళ్లి వారికి నిజంగా వ్యాధి తగ్గిందా? లేదా? ఉపశమనం పొందారా లేదా అన్న విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
* వివిధ మందులు, ఆయుర్వేదంలో సూచించిన మొక్కల జాతులతో చాలా వరకు సరిపోలుతున్నట్లు వివరించారు.
* నాటు వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న తమ తండ్రి/ బంధువుల దగ్గర శిష్యరికం చేసి, వారి సూచనల ప్రకారం మందులు తయారు చేయడంలో శిక్షణ పొందడం మినహా వారు ఇతర చదువులేమీ చదవడంలేదు.
పట్టాలు లేకపోయినా... వైద్య పరిజ్ఞానం పుష్కలం: ‘నాటు వైద్యుల ద్వారా చాలా రోగాలు నయమవుతున్నట్లు తెలిసి వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అదే అంశంపై పరిశోధనలు ఆరంభించాను. ఉమ్మడి విశాఖ జిల్లాలోని దాదాపు 12 మండలాల్లో తిరిగి నాటు వైద్యులతోనూ, రోగులతోనూ మాట్లాడాను. ఇస్తున్న మందులు, తయారీకి వినియోగిస్తున్న పలు వృక్షాలకు చెందిన భాగాలను పరిశీలించాను. చాలా మందికి వ్యాధులు నయమవుతున్నాయి. గిరిజన తండాల్లో కొందరి దగ్గర పట్టాలు లేకపోయినా అనుభవంతో వచ్చిన పుష్కలమైన వైద్య పరిజ్ఞానం మాత్రం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’