గృహప్రవేశానికి ధరల సెగ
నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది.
జగనన్న కాలనీల్లో నిర్మాణాలు నత్తనడక
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి
దేవరాపల్లి సమీపంలోని ఓ లేఅవుట్లో అసంపూర్తి నిర్మాణాలు
నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా జిల్లాలో తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే గడువు నాటికి జిల్లాలో లక్ష్యం మేర ఇళ్ల నిర్మాణాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో పాటు నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో లక్ష్యం చేరుకోవడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇళ్లు నిర్మిస్తారా?, లేకుంటే పట్టాలు రద్దు చేయమంటారా అని బెదిరింపులకు దిగాల్సి వస్తోంది.
జిల్లాలో 44,133 మందికి ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 10,462 ఇళ్లు సొంత స్థలం కలిగిన వారికి మంజూరు చేశారు. మిగతా వారికి 787 లేఅవుట్లలో స్థలాలు ఇచ్చారు. వీటన్నింటినీ 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు 41 వేల మంది లబ్ధిదారులతో భూమి పూజ నిర్వహించారు. తర్వాత నిర్మాణాల్లో ఆ జోరు కనిపించలేదు. నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. లేఅవుట్లు ఊరికి దూరంగా ఉండడం, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు పక్కన స్థలాలివ్వడంతో ప్రభుత్వం ఇచ్చిన యూనిట్ ధరతో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని అసంపూర్తిగా వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు 3,500 ఇళ్లు శ్లాబులు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు.. మరో పక్షం రోజుల్లో సామూహిక గృహ ప్రవేశాలు చేయబోతున్నారు. అప్పటికి మిగతా 5,500 ఇళ్లు పూర్తిచేయడం అనుమానమేనని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి.
కానరాని మౌలిక సదుపాయాలు
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై ప్రతి శనివారం హౌసింగ్ డే పేరుతో అధికారులు సమీక్షిస్తున్నారు.. ఇళ్ల పనులు మొదలుపెట్టని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. లేఅవుట్లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై మౌనం దాల్చుతున్నారు. కొన్ని లేఅవుట్లలోకి నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లడానికి కూడా వీలులేనంతగా రహదారులున్నాయి. కుళాయిలు ఏర్పాటు చేసినా ఆ నీళ్లు నిర్మాణాలకు సరిపోవడం లేదు. నిర్మాణ సామగ్రిని నిల్వచేయడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. వీటిని ఏ రోజు అవసరాలకు ఆ రోజు కొని తరలించడం భారంగా మారుతోంది. ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు.
ప్రభుత్వం సరఫరా చేసే సామగ్రి చాలడం లేదు. బయట అంతకు రెండింతలు కొనాల్సి వస్తోంది. ఇటుక, సిమెంటు, ఇనుము ఖర్చులు పెరుగుతుండడంతో నిర్మాణాలపై పునరాలోచనలో పడుతున్నారు. జిల్లాలో ఇసుకకు కొరత ఉంది. నర్సీపట్నం ఇసుక డిపో నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. మిగతా డిపోల్లోను అరకొరగానే ఉన్నాయి.
నిర్మించేలా ప్రోత్సహిస్తున్నాం...
కూర్మినాయుడు, జిల్లా హౌసింగ్ హెడ్, అనకాపల్లి
ప్రభుత్వమిచ్చే యూనిట్ ధరకు అదనంగా స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.35 వేలు రుణం ఇప్పిస్తున్నాం. కాలనీలో సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ప్రతి శనివారం లబ్ధిదారుల దగ్గరకే వెళ్లి నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రోత్సహిస్తున్నాం. సామూహిక గృహ ప్రవేశాల నాటికి 80 శాతం లక్ష్యం చేరుకుంటామనే నమ్మకం ఉంది. మిగతా ఇళ్లను వేగంగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు