logo

అణగారిన వర్గాల అభ్యున్నతి అంబేడ్కర్‌ చలవే

అణగారిన వర్గాలు ఈ రోజు తలెత్తుకు తిరుగుతున్నాయంటే అది అంబేడ్కర్‌ చలవేనని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Updated : 07 Dec 2022 04:19 IST

పేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అణగారిన వర్గాలు ఈ రోజు తలెత్తుకు తిరుగుతున్నాయంటే అది అంబేడ్కర్‌ చలవేనని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. భీమునిగుమ్మంలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ సత్యవతితో కలసి పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. వెనుకబడిన వర్గాలను మరింత బలోపేతం చేసేందుకు బుధవారం విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ గర్జన విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు మందపాటి జానకీరామరాజు, జాజుల రమేష్‌, కొణతాల మురళీకృష్ణ. ఉగ్గిన అప్పారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని