అరకొరగా చౌక బియ్యం పంపిణీ
తెల్లకార్డుదారులకు ఈనెల చౌక బియ్యం పూర్తి స్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని అన్న చందంగా జిల్లాలో బియ్యం సరఫరా వ్యవస్థ తయారైంది.
పూర్తి స్థాయిలో డిపోలకు చేరని సరకు గోదాముల్లో ఉన్న బియ్యం బస్తాలు
వన్టౌన్, న్యూస్టుడే: తెల్లకార్డుదారులకు ఈనెల చౌక బియ్యం పూర్తి స్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని అన్న చందంగా జిల్లాలో బియ్యం సరఫరా వ్యవస్థ తయారైంది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న పెందుర్తి ప్రధాన గోదాములో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ మర్రిపాలెం, అగనంపూడి, ఆనందపురం, భీమునిపట్నం ప్రాంతాల్లో ఉండే మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సకాలంలో సరకు చేర్చడంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ) విఫలమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 640 డిపోల్లో రేషన్ పంపిణీ నెమ్మదిగా సాగుతోంది.
* ప్రస్తుతం డిపోల్లో కేవలం 50శాతం కార్డుదారులకు సరిపడా బియ్యం నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో వారం రోజుల్లో పంపిణీ ముగియాల్సి ఉంది. ఈ తరుణంలో గోదాముల నుంచి బియ్యం నిల్వలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నెలలో పూర్తి స్థాయిలో పంపిణీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని డిపోల్లో బియ్యం అందుబాటులో లేవని డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు చెబుతుండడంతో కార్డుదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
చేతులెత్తేసిన గుత్తేదారు
* పెందుర్తిలోని ప్రధాన గోదాము నుంచి జిల్లా అవసరాలకు సరిపడా 9వేల టన్నుల బియాన్ని ప్రతినెల మర్రిపాలెం, అగనంపూడి, ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం మండలాల్లోని నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. ఆయా పాయింట్ల నుంచి డీలర్లకు బియ్యం చేరవేస్తారు. ప్రతి నెల 20వ తేదీ తర్వాత ఈ ప్రక్రియ చేపట్టి నెలాఖరుకు ముగిస్తారు. అయితే గత కొద్దిరోజులుగా పెందుర్తిలోని ప్రధాన నిల్వ కేంద్రం మండల స్థాయి కేంద్రాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. బియ్యం సరఫరా బాధ్యతలు తీసుకున్న గుత్తేదారు చేతులెత్తేశారు. ప్రత్యామ్నాయాలు చూడాల్సిన అధికారులు పట్టనట్లు ఉండిపోయారు. దీంతో ఈనెల కేవలం 50శాతం బియ్యం డిపోలకు చేరింది. ఇది పంపిణీ అయ్యాక ఏమి చేయాలో తెలియడం లేదని డీలర్లు వాపోతున్నారు.
* ఒకటి, రెండు రోజుల్లో పెందుర్తి ప్రధాన గోదాము నుంచి సరకు వస్తుందని, కార్డుదారులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా... పెద్ద సంఖ్యలో లారీలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన తరలిస్తే గాని గడువులోపు కార్డుదారులకు బియ్యం అందజేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!