logo

సైకిల్‌పై కశ్మీర్‌ నుంచి కన్యాకుమారికి..

యువత సైక్లింగ్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాలని సైకిల్‌ యాత్రికుడు సంజయ్‌మయూరే తెలిపారు. ఫిట్‌ ఇండియా పేరుతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయన చేపట్టిన యాత్ర మంగళవారం పాయకరావుపేటకు చేరుకుంది.

Published : 07 Dec 2022 03:05 IST

తన యాత్ర గురించి నరసింహారావు, విద్యార్థినులకు వివరిస్తున్న సంజయ్‌ మయూరే

పాయకరావుపేట, న్యూస్‌టుడే: యువత సైక్లింగ్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాలని సైకిల్‌ యాత్రికుడు సంజయ్‌మయూరే తెలిపారు. ఫిట్‌ ఇండియా పేరుతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయన చేపట్టిన యాత్ర మంగళవారం పాయకరావుపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల అధినేత సీహెచ్‌.వి.కె.నరసింహారావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. శారీరక దారుఢ్యంపై అవగాహన పెంచేందుకు యాత్ర చేపట్టానని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని