బీసీలను అణగదొక్కుతున్న వైకాపా
బీసీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, నామమాత్ర పదవులిచ్చి కపట ప్రేమ కనబర్చుతోందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు
కలెక్టరేట్ వద్ద నిరసనలో తెదేపా
ఆందోళనలో పాల్గొన్న తెదేపా నాయకులు
వన్టౌన్, న్యూస్టుడే: బీసీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, నామమాత్ర పదవులిచ్చి కపట ప్రేమ కనబర్చుతోందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. బీసీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నిరసిస్తూ బుధవారం విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ధ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎస్.శ్రీనివాసమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో తెదేపాకు చెందిన బీసీ నాయకులపై వైకాపా నేతలు దాడులు చేయడంతోపాటు హత్యలకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మూడున్నరేళ్లలో బీసీల్లో ఉన్న చేతివృత్తుల వారికి రుణాలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ నివేదిక కాకుండా బీసీ కార్పొరేషన్ నివేదిక పెట్టడం వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం 24 శాతానికి పడిపోయింది. ఫలితంగా బీసీలు ఏకంగా 16వేల పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తూనే మరో పక్క జయహో బీసీ సదస్సు నిర్వహించడం జగన్ మోసపు విధానానికి నిదర్శనం. వైకాపా పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డిలు బీసీలను అణగదొక్కుతున్నార’ని ధ్వజమెత్తారు.
* పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ‘బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంతోపాటు ఖర్చు చేయాలి. షరతులు లేకుండా విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ సలహాదారులు, వీసీ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయించాల’ని డిమాండ్ చేశారు.
* దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ .. స్థానిక సంస్థల్లో రద్దు చేసిన పదిశాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్కు పూర్వ వైభవం కల్పించాలని డిమాండ్ చేశారు.
* కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం.శ్రీభరత్, రాష్ట్ర కార్యదర్శులు బండారు అప్పలనాయుడు, వీఎస్ఎన్ మూర్తియాదవ్, లొడగల కృష్ణ, పొడుగు కుమార్, బొండా జగన్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా