logo

కత్తితో దాడి కేసులో నిందితుడి అరెస్టు

కత్తితో దాడి చేసిన వ్యక్తిని కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. కంచరపాలెం మెట్టు ప్రాంతంలో ఉంటున్న కామేశ్వరరావు, మస్తాన్‌ చిల్లర వ్యాపారులు.

Updated : 08 Dec 2022 05:49 IST

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కత్తితో దాడి చేసిన వ్యక్తిని కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. కంచరపాలెం మెట్టు ప్రాంతంలో ఉంటున్న కామేశ్వరరావు, మస్తాన్‌ చిల్లర వ్యాపారులు. వీరు రోడ్లపై తలదాచుకునే కూలీలు, యాచకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. మంగళవారం రాత్రి కామేశ్వరరావు.. మస్తాన్‌ను పిలిచి తనకు రావాల్సిన డబ్బుల గురించి అడిగాడు. ఆగ్రహించిన అతడు కామేశ్వరరావుపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం మస్తాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని రెండు వారాల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విజయకుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని