పేద విద్యార్థుల చదువులపై..చిన్నచూపే
విశాఖలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సమస్యలు విద్యార్థులకు పరీక్షగా మారాయి. తమ ప్రాంతానికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన పేద విద్యార్థులకు ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవస్థలెన్నో
నియామకాల ఊసే మరచిన పాలకులు
ఆనందపురం ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలకు కేటాయించిన ఓ తరగతి గది
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సమస్యలు విద్యార్థులకు పరీక్షగా మారాయి. తమ ప్రాంతానికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన పేద విద్యార్థులకు ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కో కళాశాలలో ఒక్కో రకమైన సమస్య. ఏళ్లుగా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. విద్యాబోధనకు అతిథి అధ్యాపకులపైనే ఆధారపడుతున్నారు.
ఆనందపురం, మల్కాపురంలలో జూనియర్ కళాశాలలను 2019లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే గదులు కేటాయించి జూనియర్ కళాశాల కార్యకలాపాలను ఆరంభించారు. కీలకమైన అధ్యాపకుల నియామకాలు మాత్రం చేపట్టలేదు. అతిథి అధ్యాపకులతో నిర్వహించుకోవాలని సూచించారు. పర్యవేక్షణకు వీలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికపై విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులను డిప్యుటేషన్పై ‘ఇన్ఛార్జి ప్రిన్సిపల్’గా పంపించారు. మిగిలిన బోధన సిబ్బంది అందరూ ‘అతిథి’ అధ్యాపకులే కావడం గమనార్హం.
* గాజువాక సమీపంలోనే ఇస్లాంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల 2007లో ఏర్పాటైంది. నేటికీ ఆ కళాశాలకు పూర్తిస్థాయి అధ్యాపకులు లేరు. ఒప్పంద, అతిథి అధ్యాపకులతోనే ఆ కళాశాల కొనసాగుతోంది.
* అతిథి అధ్యాపకుల కష్టాలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. వారికి ఇచ్చే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి నెలకు రూ.పది వేల వేతనం మించకూడదని మరో విస్మయకర నిబంధనను అమలు చేస్తున్నారు. జిల్లాలోని కళాశాలల్లో మరో తొమ్మిది మంది అతిథి అధ్యాపకుల నియామకం జరగాల్సి ఉన్నా...కార్యాచరణ ముందుకు కదలడం లేదు.
* మధురవాడ పరిసర ప్రాంతాల పేద పిల్లలకు చంద్రంపాలెం ఉన్నత పాఠశాల కొండంత అండగా నిలుస్తోంది. అక్కడ వేలాది మంది చదువుతున్నారు. ఇక్కడ జూనియర్ కళాశాల అవసరమని 2013లో ఏర్పాటుచేశారు. కేటాయించిన స్థలంలో భవన నిర్మాణాలు పూర్తైన తరువాత 2018లో నూతన ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. కళాశాలకు అన్నీ వసతులూ ఉన్నా... పూర్తిస్థాయి అధ్యాపకుల నియామకం మాత్రం నేటికీ జరగలేదు.
* ఆనందపురం ఉన్నత పాఠశాలలో 2019లో జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎం.ఎల్.టి.(మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్), ఎ.ఇ.టి.(ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్) కోర్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నేటికీ కేవలం ఎంపీసీ, సీఈసీ, ఎం.ఎల్.టి. కోర్సులనే నిర్వహిస్తున్నారు. కళాశాల నిర్వహణకు పాఠశాలలో తొలుత నాలుగు గదులు కేటాయించినా ప్రస్తుతం వాటిని రెండు గదులకే పరిమితం చేశారు. కళాశాల నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించినా.... భవన నిర్మాణం మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. ఆనందపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు సుమారు 300 మంది ఉన్నా... ఇంటర్లో చేరడానికి మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ప్రారంభ సంవత్సరంలో ఎంపీసీ, సీఈసీ, ఎం.ఎల్.టి.లో 70మంది చేరగా.... ప్రస్తుతం కళాశాల మొత్తం మీద కేవలం 45 మంది విద్యార్థులే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా