దిగొచ్చిన వీఎంఆర్డీఏ
‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్’ ప్లాట్ల ధరలపై వీఎంఆర్డీఏ వెనక్కి తగ్గింది. ఈ పథకంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కరవైంది.
పాలవలస లేఅవుట్లో ధర తగ్గింపు
ఈనాడు, విశాఖపట్నం: ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్’ ప్లాట్ల ధరలపై వీఎంఆర్డీఏ వెనక్కి తగ్గింది. ఈ పథకంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన కరవైంది. ఆశించినన్ని దరఖాస్తులు రాకపోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలోని పాలవలస లేఅవుట్లోని ప్లాట్ల స్పందనే రాలేదు. రెండు సార్లు గడువు పెంచి దరఖాస్తులు పిలిచినా ఫలితం లేదు. ఇక్కడ 446 ప్లాట్లకు గత నెలాఖరు వరకు కేవలం 71 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. పరిస్థితిని గుర్తించిన అధికారులు ఎట్టకేలకు చదరపు గజం ధర తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో చదరపు గజం ధర రూ.18 వేలు ఉండగా దాన్ని రూ.14,500కు తగ్గిస్తూ గురువారం ప్రకటన జారీ చేశారు. అన్ని మౌలిక వసతులతో సొంతింటిని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు మేరకు ధర తగ్గించినట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
* ‘జగనన్న స్మార్ట్టౌన్షిప్స్’ పథకంలో పాలవలస, జీఎస్అగ్రహారం, రామవరంలో లేఅవుట్లను వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది. జీఎస్ అగ్రహారం, రామవరంలో చ.గజం ధర రూ.14 వేలు, పాలవలసలో రూ.18 వేలుగా నిర్ణయించారు. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధర నిర్ణయించాలని చెబితే వీఎంఆర్డీఏ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. పాలవలస లేఅవుట్కు ఏకంగా అధిక ధర నిర్ణయించేశారు. అక్కడ బహిరంగ మార్కెట్లో స్థలాలు అంతకన్నా తక్కువ ధరకే లభ్యమవడంతో దీనిపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు లబ్ధి చేకూర్చేందుకే ఆ ధర నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలవలస లేఅవుట్కు ఆనుకొని అతనికి చెందిన లేఅవుట్ ఉండడంతో వాటికి మంచి ధర రప్పించేందుకు కొందరు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ధర తగ్గింపు ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
784 రేషన్ కార్డుల మంజూరు
వన్టౌన్, న్యూస్టుడే ఈ ఏడాది జూన్ 16వ తేదీ నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు 784 రేషన్కార్డ్డులు (రైస్ కార్డులు) మంజూరయ్యాయి. వాటితోపాటు 739 స్ల్పిట్ కార్డుల మంజూరుకు ఆమోదం పొందినట్లు ప్రభుత్వ డ్యాష్బోర్డులో పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు మంజూరైన ఆయా కార్డులను త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు. రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసి మంజూరు కోసం నగర వాసులు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!