ఉద్యోగి ఉక్కిరిబిక్కిరి
తమిళనాడుకు చెందిన యువ ఐపీఎస్ అధికారి శశికుమార్ పాడేరు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈయన విధుల్లో చురుగ్గా వ్యవహరించేవారు.
పథకాల వారీగా లక్ష్యాలతో సతమతం
ప్రాణాల మీదకొస్తున్న పని ఒత్తిడి
ఈనాడు డిజిటల్, అనకాపల్లి: తమిళనాడుకు చెందిన యువ ఐపీఎస్ అధికారి శశికుమార్ పాడేరు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈయన విధుల్లో చురుగ్గా వ్యవహరించేవారు. అప్పట్లో ఏజెన్సీ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుండడంతో దీనిపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఆయన తన కార్యాలయంలో పిస్తోల్తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రెండేళ్ల కిందట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామ్ప్రసాద్ పని ఒత్తిడి కారణంగా తన నివాసంలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. తాగునీటి పథకాల లక్ష్యాలను చేరుకోలేపోతున్నానని, సకాలంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదనే ఆవేదనే ఆయన ఊపిరి తీసింది. తాజాగా పెదబయలు మండలం తహసీల్దారు శ్రీనివాసరావు గురువారం ఉదయం తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పని ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు సహచరులు చెబుతున్నారు.
ఓవైపు కార్యాలయ విధులు.. మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు.. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. వీటన్నింటిపైనా వారానికి మూడు, నాలుగు రోజులు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు.. రోజూ రెండు, మూడుసార్లు టెలీ, వీడియో కాన్ఫరెన్స్లతో క్షణం తీరికలేకుండా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నుంచి జిల్లాస్థాయి కార్యాలయ అధికారుల వరకు అందరి పరిస్థితి ఇలానే ఉంది. రెండు రోజుల క్రితం జీవీఎంసీ పరిధిలోని వార్డు సచివాలయంలో పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శిగా పనిచేసిన చంద్రమోహన్ గుండెపోటుతో చనిపోయాడు. పనిఒత్తిడి.. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే చనిపోయాడని సహచర ఉద్యోగులంతా జీవీఎంసీ ఎదుట నిరసన తెలిపారు. తాజాగా పెదబయలు మండలం తహసీల్దారు ఆత్మహత్య ఉదంతంతో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
రెవెన్యూపైనే ఎక్కువ..
జగనన్న భూసమగ్ర సర్వే కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎంతో పక్కాగా చేపట్టాల్సిన భూముల రీసర్వేకు గడువు తేదీలను నిర్ణయించి ఆలోగా సర్వే పూర్తిచేయించాలని లక్ష్యాలు విధిస్తున్నారు. చేయనివారికి షోకాజ్ నోటీసులిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా ఉమ్మడి జిల్లాలో వీఆర్వోలు, సర్వేయర్లు, తహసీల్దార్లు రాత్రీ పగలు తేడాలేకుండా పనిచేస్తున్నారు. కొంతమంది ఇళ్లకు కూడా వెళ్లకుండా కార్యాలయాల్లోనే రోజులు తరబడి గడుపుతున్నారు. ఇటీవల రోలుగుంట మండలంలో క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలంటూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.. ఆయన కూడా వారితో సమానంగానే పనిచేస్తున్నారు. ఓ వైపు భూముల సర్వేలు చేస్తూనే కార్యాలయంలో మిగతా పనులు, మ్యుటేషన్లు, స్పందన ఫిర్యాదుల పరిష్కారాలు ఏకకాలంలో చేయాల్సి రావడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెదబయలు తహసీల్దారు శ్రీనివాసరావు కూడా భూముల సర్వేకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో అధికారుల మందలింపునకు గురయ్యానని, కిందిస్థాయి సిబ్బంది కూడా సహకరించడం లేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సహచరులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలోనూ కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే షోకాజ్ నోటీసులు అందుకున్నారు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఎస్.రాయవరం తహసీల్దారును రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు తహసీల్దార్ల పనితీరు బాగోలేదని ఇటీవల జిల్లా ఉన్నతాధికారే సమీక్షా సమావేశంలో చెప్పడంతో రెవెన్యూ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మిగతా శాఖల్లోనూ టార్గెట్లు..
* జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు తక్కువగా ఉన్న చోట గృహనిర్మాణ సిబ్బంది, అధికారులపైనా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డే పేరుతో పురోగతిని చూపించకుంటే తాఖీదులిస్తున్నారు.
*జల్ జీవన్ మిషన్ పథకంలో ఇంటింటా కుళాయి పనులకు లక్ష్యాలను విధించారు. టార్గెట్లు చేరుకోని వారికి వారం వారం సమీక్షలు నిర్వహించి వివరణ కోరుతున్నారు.
* పంచాయతీరాజ్ శాఖలో సచివాలయాలు, ఆర్బీకే, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాలకు లక్ష్యాలు విధించారు. వారాంత సమీక్షలో ఎస్ఈ నుంచి ఏఈ వరకు పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి మందలింపులు వస్తున్నాయి. బీ నాడు-నేడు పనులకు టార్గెట్లు పూర్తి చేయనివారికి శ్రీముఖాలు జారీ చేస్తున్నారు. బీ పాఠశాలల్లో యాప్లను నిర్వహించకపోయినా.. ముఖ హాజరు నమోదు చేయకపోయినా ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేస్తున్నారు.
* ఇలా వివిధ శాఖల్లో పెట్టే టార్గెట్లు తట్టుకోలేక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళుతుంటే, మరికొందరు వీఆర్ఎస్ బాట పడుతున్నారు. సున్నిత మనస్కులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
విలపిస్తున్న శ్రీనివాసరావు భార్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM