హాకీ పోటీల్లో హోరాహోరీ
నక్కపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ పోటీలు, ఎంపికలు హోరాహోరీగా జరిగాయి.
నక్కపల్లి, న్యూస్టుడే: నక్కపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి హాకీ పోటీలు, ఎంపికలు హోరాహోరీగా జరిగాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్.) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఉప ఎంపీపీ వీసం నానాజీ తదితరులు ప్రారంభించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పాఠశాలలనుంచి 220 మంది హాజరయ్యారు. వీరంతా జట్లుగా ఏర్పడ్డారు. అనంతరం నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడటంతో మైదానంలో విద్యార్థులు, క్రీడాకారులు చప్పట్లతో ఉత్సాహపరిచారు. నక్కపల్లి ఉన్నత పాఠశాలతోపాటు, బాలికల ఉన్నత పాఠశాల, ఎస్.రాయవరం మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు బాలురు, బాలికల విభాగంలో నక్కపల్లి ప్రథమ, ద్వితీయ స్థానంలో ఎలమంచిలి జట్లు నిలిచినట్లు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయకర్త కుందూరు రాజు తెలిపారు. వీరంతా త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. విజేతలకు సబ్ రిజిస్ట్రార్ గౌస్య బేగం, ఉప సర్పంచి వీసం రాజు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్.జి.ఎఫ్. కార్యదర్శి శేఖర్, రమేష్ నాయుడు, కిరణ్, పాఠశాల కమిటీ ఛైర్పర్సన్ కర్రి పద్మ, కోచ్లు సింహాచలం, సాయిబాబు, బి.ఎస్. హాకీ క్లబ్ వ్యవస్థాపకులు బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా