‘ప్రజలపై భారం వేస్తే విద్యుత్తు ఉద్యమమే’
కార్పొరేట్ సంస్థల లాభాల కోసం విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే విద్యుత్తు ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తితో మాట్లాడుతున్న సీఐ సింహాద్రినాయుడు
గురుద్వారా, న్యూస్టుడే: కార్పొరేట్ సంస్థల లాభాల కోసం విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే విద్యుత్తు ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. విద్యుత్తు ఛార్జీలపై పెంపుపై గురుద్వారా దరి ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన నేపథ్యంలో వామపక్షాలు అక్కడ నిరసన వ్యక్తం చేశాయి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని 89 లక్షల నివాసగృహాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలన్నింటికీ 2025 మార్చిలోపు ప్రీపెయిడ్ స్మార్ట్మీటర్లు పెట్టాలనే ప్రతిపాదనను తప్పుపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతి వచ్చినా.. ప్రత్యక్ష సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించారు. రూ.13వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేయాలన్న నిర్ణయం సరికాదన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్మీటర్లు ఏర్పాటుచేస్తే వినియోగదారులపై వేల కోట్లలో భారం అదనంగా పడుతుందని స్పష్టం చేశారు. ఒక్కో మీటరుకు రూ.వేలు చెల్లించి విద్యుత్తును వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ద్వారకా పోలీస్స్టేషన్ సీఐ సింహాద్రినాయుడు నిరాకరించారు. దీంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు వారికి సర్దిచెప్పడంతో కొద్ది సమయం నిరసన తెలిపి వెనుదిరిగారు. నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
* అభిప్రాయ సేకరణలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దన్రెడ్డిలు సంస్థల పరంగా అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాలను చదివి వినిపించారు. 57 మంది మాట్లాడేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తొలి రోజు 20 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను, సూచనలు తెలియజేశారు. వ్యవసాయానికి స్మార్ట్మీటర్లు వద్దని, వ్యవసాయ మీటర్ల మంజూరులో జాప్యం, ఆర్థికలోటు పేరుతో వినియోగదారులపై భారం వంటి వాటిపై పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఏపీఆఈఆర్సీ కమిషన్ కార్యదర్శి కె.రాజబాపయ్య, మూడు విద్యుత్తు పంపిణీ సంస్థల డైరక్టర్లు, ఎస్ఈ, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
* వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అనకాపల్లి జిల్లా సీపీఐ నాయకులు రాజాన దొరబాబు ఈఆర్సీ ఛైర్మ్న్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019-20లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటి వరకు కనెక్షన్లు ఇవ్వలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా