వచ్చేదెలా.. ఉండేదెలా!!
నగర పరిధిలోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయా నివాస సముదాయాల్లో సదుపాయాలు కల్పించకపోవడంతో సగం మంది కూడా నివాసం ఉండడం లేదు.
టిడ్కో గృహాల్లో అసౌకర్యాలపై ఆవేదన
న్యూస్టుడే, కార్పొరేషన్
గాజువాక వికాస్నగర్లోని టిడ్కో ఇళ్లు
నగర పరిధిలోని టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయా నివాస సముదాయాల్లో సదుపాయాలు కల్పించకపోవడంతో సగం మంది కూడా
నివాసం ఉండడం లేదు. ఫలితంగా పేదలకు సొంతింటి కల సుదూరంగానే ఉండిపోతోంది.
మరో వైపు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా రూ.35వేలు చెల్లించాల్సి రావడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
టిడ్కో (టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట కార్పొరేషన్) పథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం నగరంలోని పేదలకు 24,192 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్ల క్రితం దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి.
* తర్వాత వైకాపా ప్రభుత్వం రావడంతో వాటిని పట్టించుకోలేదు. ప్రతిపక్షాల ఆందోళనలతో మూడు నెలల క్రితం 4,500 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం ఏర్పాటు చేసిన జీవీఎంసీ యూసీడీ అధికారులు 2,609 ఇళ్లకు సంబంధించిన పట్టాలు అందజేశారు. ఆయా ఇళ్లకు ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో కేవలం 1,345 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి.
97వేల ఇళ్లు మంజూరు..
విశాఖలో అర్హులైన పేదలకు 97వేల ‘టిడ్కో’ ఇళ్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికి 24,192 మందికి గృహాలు అందుబాటులో ఉండగా, మరికొంత మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో లేఅవుట్లను ఏర్పాటు చేసి వేల మందికి స్థలాలను గుర్తించారు. ఆయా వివరాలను కేంద్రానికి తెలియజేయడంతో 97 వేల ఇళ్ల నిర్మాణానికి అంగీకరించింది.
ముదపాకలో పునాదుల దశలో...
నిధుల వేటలో లబ్ధిదారులు: అందరికీ ఇళ్లు పథకంలో ఎంపిక చేసిన 97వేల మంది తమ వాటాగా ఒక్కొక్కరు రూ.35వేలు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబితే మహిళా సంఘాల ద్వారా రుణాలను తీసుకునే వెసులుబాటు కల్పించారు. మహిళా సంఘాల ద్వారా ఇంత వరకు 9,067 మంది రుణాలు తీసుకుని ఆయా నిధులు చెల్లించారు. మరో 28వేల మందికి రుణాలు ఇవ్వాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. మిగతా వారు తమ సొంత నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.1.80 లక్షల చొప్పున కేటాయించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ యూసీడీ సిబ్బంది లబ్ధిదారులకు చెప్పి వారి వాటా చెల్లించాలని కోరుతున్నారు. అయితే ఆయా నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళుతున్నాయా లేదా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుకు వెళుతుందా అనే అంశంపై స్పష్టత లేదు.
ఎప్పటికి పూర్తవుతాయో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్ ప్రతి శనివారం జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలించి నివేదిక పంపించాల్సి ఉంటుంది. దీంతో కమిషనర్ రాజాబాబు జగనన్న కాలనీలకు వెళ్లి ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులతో మాట్లాడి ఇళ్ల పురోగతి తెలుసుకుంటున్నారు. నగర పరిధిలో ఇప్పటికింకా పునాదుల దశలోనే ఇళ్ల నిర్మాణాలు ఉండటంతో ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు