logo

‘కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి’

కాంగ్రెస్‌ పార్టీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని పీసీసీ అధ్యక్షుడు జి.రుద్రరాజు అన్నారు. గురువారం నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ‘చేయి చేయి కలుపుదాం రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’ యాత్రను ప్రారంభించారు.

Published : 27 Jan 2023 03:11 IST

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని పీసీసీ అధ్యక్షుడు జి.రుద్రరాజు అన్నారు. గురువారం నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ‘చేయి చేయి కలుపుదాం రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’ యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి గురువారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రతో దేశ ప్రజల్లో మార్పు వచ్చిందని, కాంగ్రెస్‌ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అనంతరం యాత్రకు సంబంధించిన గోడపత్రిక విడుదల చేశారు. జగదాంబకూడలి మీదుగా డాల్ఫిన్‌ కూడలి వరకు ర్యాలీ సాగింది. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొంపా గోవిందురాజు, తోట వాసుదేవరావు, బమ్మిడి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని