logo

వివాహిత బలవన్మరణం

ప్రేమించిన వ్యక్తితో వివాహమై మూడు నెలలు గడవక ముందే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలిలా....మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్న సంధ్య (20), శ్రావణ్‌కుమార్‌లు ప్రేమించుకున్నారు.

Published : 27 Jan 2023 03:11 IST

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ప్రేమించిన వ్యక్తితో వివాహమై మూడు నెలలు గడవక ముందే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలిలా....మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్న సంధ్య (20), శ్రావణ్‌కుమార్‌లు ప్రేమించుకున్నారు. వీరి వ్యవహారం తెలిసి పెద్దలు వివాహం జరపడంతో అదే కాలనీలో కాపురం పెట్టారు. వీరి ఇంటికి దగ్గరలోనే సంధ్య తల్లి, సోదరి నివసిస్తున్నారు. సోదరికి వివాహం కుదరడంతో బుధవారం తల్లితో కలిసి శుభలేఖలు పంచడానికి సంధ్య వెళ్లింది. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్న ఆమెకు.. భర్త వేరొకరితో ఇంట్లో ఉండడం చూసింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగి భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో రాత్రి వేళ ఇంట్లోని ఫ్యానుకు ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి ఎస్సై సునీత కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని