తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గణేష్ (పాతచిత్రం)
మధురవాడ, న్యూస్టుడే: విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ అయిదో వార్డు శివశక్తినగర్లో లారీ డ్రైవర్ బొట్టా కనకరాజు కుటుంబంతో నివసిస్తున్నారు. ఇతని కుమారుడు గణేష్(18) స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో ఉన్న సమయంలో చదువుపై శ్రద్ధ పెట్టకుండా చరవాణి ఎక్కువగా వాడడంతో తండ్రి గణేష్ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురై తన గదిలోని ఫ్యాన్కు శుక్రవారం ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లు రద్దు చేసిన కేంద్రం