నిధులు నీళ్లపాలు..
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధిని గాలికొదిలేసింది.
నాణ్యత లేక గగ్గోలు
మునగపాక, న్యూస్టుడే
గణపర్తి వద్ద కుంగిన శారదా నది గట్టు
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధిని గాలికొదిలేసింది. ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనిని పరిశ్రమ సామాజిక బాధ్యత కింద చేపట్టింది. పోనీ.. ఆ పనులనైనా అధికారులు సక్రమంగా పర్యవేక్షిస్తున్నారా అంటే అదీలేదు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో నిర్మించిన మూడు మాసాలకే కుంగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ మునగపాక మండలం గణపర్తి వద్ద శారదా నది ఎడమగట్టు నిలుస్తుంది. సుమారు రూ.కోట్లతో నిర్మించిన శారదానది గట్టు మూడు మాసాలకే కుంగిపోయింది.
గణపర్తి వద్ద శారదానది ఎడమగట్టు దశాబ్ద కాలంగా బలహీనపడింది. వర్షాకాలం వస్తే నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా గడిపేవారు. కోతకుగురైన గట్టుకు మూడేళ్ల క్రితం విశాఖ డెయిరీ నిధులు రూ.36 లక్షలతో మరమ్మతులు చేపట్టింది. అయితే ఏడాదికే అది కోతకు గురైంది. పక్కాగా సిమెంట్ కాంక్రీట్ గోడతో చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంతీయులు ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి, ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు దృష్టికి తీసుకెళ్లారు. జలవనరుల అభివృద్ధికి ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ ముందుకొచ్చింది. గత ఏడాది మార్చి నెలలో రూ.2.71కోట్ల నిధులు పరిశ్రమ కేటాయించింది. అంబుజా సిమెంట్ పరిశ్రమ ద్వారా పనులు చేపట్టారు.
నదిలోకి కుంగిన కాంక్రీట్ గోడ
ప్రారంభించిన మూడు నెలలకే..
ఆకర్షణీయంగా కనిపించేలా కొండరాతితో గట్టు పేర్చి మట్టితో గట్టును పూడ్చారు. గట్టుకి రెండు వైపులా మొక్కలు నాటారు. ఇలా పైకి అందంగా తీర్చిదిద్దిన ఈ శారదానది గట్టును గత ఏడాది అక్టోబరు 21న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ప్రారంభించారు. చిరకాలంగా ఎదుర్కొంటున్న వరద సమస్య తలెత్తకుండా పక్కాగా గట్టును తీర్చిదిద్దామని ఘనంగా ప్రకటించారు. పట్టుమని మూడు మాసాలకే గట్టు పూర్తిగా కుంగిపోయింది. కాంక్రీట్గోడలు నదిలోకి ఒరిగిపోయాయి. గట్టుపైన నాటిన కొబ్బరిమొక్కలు బీటలలో కూరుకుపోయాయి. నిర్మాణాలు ఇలాగేనా ఉండేది అంటూ రైతులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని జల వనరుల శాఖ ఏఈ హనుమంతరావు వద్ద ‘న్యూస్టుడే’ ప్రస్తావించగా గ్రోయిన్లో ఎక్కువ కాలం నీరు నిల్వచేసి, ఒకేసారి దిగువకు వదలడం వల్ల గట్టు కింద మట్టి కొట్టుకుపోయి కుంగిపోయిందన్నారు. గట్టు దెబ్బతిన్న విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారి నిధులతోనే మళ్లీ పటిష్ఠపరుస్తామన్నారు.
ఆదిలోనే హెచ్చరించినా..
సిమెంట్ కాంక్రీట్ గోడల నిర్మాణం ఎలాంటి పునాదులు తీయకుండా పైపైనే చేపట్టారు. దీంతో నిర్మాణదశలోనే ఇవి బీటలు వారాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. నాణ్యతా లోపాలపై గత ఏడాది ఆగస్టు 18న ‘నిర్మాణ దశలోనే బీటలు’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. నిధులు వెచ్చించిన ఏషియన్ పెయింట్స్ యాజమాన్యం కూడా నాణ్యతలో శ్రద్ధ తీసుకోలేదు. ఇక జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. బీటలు వారిన సిమెంట్ గోడలపైనే నిర్మాణం చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత