కొలువులు వదిలి కోరుకున్న జీవితం
మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట.
సహజ ఎరువుల తయారీలో యువజంట
సేంద్రియఎరువుల తయారీ కేంద్రం వద్ద అనిత
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, చోడవరం పట్టణం: మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట. తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టి కొత్త ఉపాధికి తాము బాటలు వేసుకున్నారు. తమతో పాటు మరో పది మందికి పని కల్పిస్తున్నారు. వారే అనకాపల్లికి చెందిన రావూరి అనిత, జయచంద్ర.
వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువుల వాడకం భూసారాన్ని దెబ్బతీస్తోంది. ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావాన్ని చూపుతోంది. వీటి స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే సేంద్రియ పంటలు పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అనిత, జయచంద్ర సహజ ఎరువుల తయారీకి పూనుకున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యర్థాలను ముడి పదార్థాలుగా చేసుకుని ఎరువుల ఉత్పత్తి మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా పలు ప్రదర్శనల్లోను పాల్గొంటున్నారు.
చిన్నచిన్న పొట్లాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన సేంద్రియ ఎరువు
కరణం జయచంద్ర బయో టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెరకు పరిశోధన విభాగంలో పదేళ్లు పనిచేశారు. ఆయన భార్య అనితా ఎం.ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాదులోని జీవీకే సంస్థలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. సేంద్రియ ఎరువుల తయారీపై ఉన్న మక్కువతో సొంతగా ఓ యూనిట్ ప్రారంభించాలనుకున్నారు. దాంతో చేస్తున్న కొలువులకు స్వస్తి చెప్పి వారికి నచ్చిన రంగంలోకి అడుగుపెట్టారు. ఎరువుల తయారీకి కావాల్సిన షెడ్ను అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో నిర్మించారు. పాడి బాగుంటే పంటలు లాభదాయకంగా పండించొచ్చని అనుకున్నారు. దీనికోసం ముందుగా పశువుల పెంపకాన్ని ప్రారంభించారు. వాటి మూత్రం, పేడ, కొబ్బరి పీచు కలిపి వర్మీ కంపోస్టు, కోకోఫిట్ వంటి ఎరువుల తయారీ మొదలుపెట్టారు. సొంతగా ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే మొక్కలను పెంచి విక్రయిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తూ..
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నా ఆచరించే రైతులు తక్కువగానే ఉంటున్నారు. దీంతో ఈ యువ జంట కూడా సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి వారిని అటువైపుగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బయట కొనుక్కోవల్సిన అవసరం లేకుండా సొంతంగా సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలను సాగుచేయడం, అంతర పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రైతులను తమ క్షేత్రాలకు తీసుకువచ్చి సహజ ఎరువులతో పండే పంటలను చూపించి ప్రోత్సహిస్తున్నారు.
భవిష్యత్తు అంతా సేంద్రియమే..
భవిష్యత్తు తరాలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గం. ఇప్పటికే సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన రైతులతో కొన్ని సంస్థలు ఒప్పందం చేసుకొని వారికి గిట్టుబాటు ధర చెల్లించి పూర్తి పంటలను కొనుగోలు చేస్తున్నాయి. సేంద్రియ పంటలు పండాలంటే సహజసిద్ధమైన ఎరువులు అవసరం అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాం.
జయచంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?