ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతే.. దాతల సాయమూ అంతంతే
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్లు లేరు.
జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి
హాకీ జిల్లా జట్ల కెప్టెన్ల మనోగతం
పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ రవికి స్వాగతం
ఎలమంచిలి, న్యూస్టుడే: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్లు లేరు. రోజూ సాధన చేద్దామంటే పరికరాలు అందుబాటులో లేవు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనాలంటే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. కష్టాలు ఎన్ని ఉన్నా జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు బాగుంటుందని రాష్ట్రంలోని హాకీ జట్ల కెప్టెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలమంచిలి పట్టణంలో అంతర్ జిల్లాల జూనియర్ మహిళా హాకీ పోటీలను శనివారం కలెక్టర్ రవి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన జట్ల కెప్టెన్లు మనోగతాలు ‘న్యూస్టుడే’కి వివరించారు.
మైదానాలు కరవే.. : క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేయడానికి చాలా జిల్లాల్లో సరైన మైదానాలు లేవు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా క్రీడా మైదానాలు ఏర్పాటుచేయాలి. అలా చేస్తే వారాంతం రోజు అయినా అక్కడికి వెళ్లి ఆటలు ఆడతారు. అలా క్రీడలపై గ్రామీణులకు ఆసక్తి పెరుగుతుంది. మండలానికో ఒక కోచ్ను నియమించాలి. అప్పుడే క్రీడారంగానికి గుర్తింపు ఉంటుంది.
జి.వరలక్ష్మి, కాకినాడ జిల్లా
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ప్రభుత్వం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. చాలామంది క్రీడాకారులు రవాణా ఛార్జీలు సైతం పెట్టుకోలేక పోటీలకు హాజరుకావడం లేదు. ఎక్కడ పోటీలు జరిగినా క్రీడాకారులు రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
గొల్ల జయశ్రీ ఎన్టీఆర్ జిల్లా
సీనియర్లకు కోచ్లుగా అవకాశం
గ్రామాల్లో చాలా మందికి హాకీ క్రీడ నేర్చుకోవాలని ఉంటుంది. అయితే వీరి శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు లేరు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ఒక కోచ్ను నియమించాలి. ఇలా చేస్తే సీనియర్ క్రీడాకారులకు కోచ్లుగా అవకాశం దక్కుతుంది.
పి.లావణ్య, గుంటూరు జిల్లా
అకాడమీ ఏర్పాటుతోనే మేలు
క్రీడాకారులకు ఆటల్లో మంచి శిక్ష ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి. అప్పుడే క్రీడాకారులు చక్కగా నేర్చుకోగలరు. నిపుణులైన కోచ్లు శిక్షణ ఇవ్వడం వల్ల ఆటలో మెలకువలు నేర్చుకుంటారు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తయారవ్వాలంటే అకాడమీ అవసరం. అక్కడ మంచి ఆహారం ఇస్తారు. చక్కగా నేర్పుతారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
ఎస్.కల్యాణి, కెప్టెన్, విశాఖ జిల్లా జట్టు
సామగ్రి ఉచితంగా ఇస్తే సాధన
క్రీడాకారులకు ప్రభుత్వం ఉచితంగా క్రీడా సామగ్రి సరఫరా చేయాలి. మార్కెట్లో వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రతి పాఠశాలను, కళాశాలను యూనిట్గా తీసుకుని పరికరాలు అందించాలి.
ఎం.లలిత, ప్రకాశం జిల్లా
ఎనిమిది సార్లు జాతీయస్థాయిలో ఆడాను
రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఎనిమిది సార్లు హాకీ నేషనల్స్ ఆడాను. ఆరేళ్లుగా ప్రత్యేక సాధన చేస్తున్నాను. క్రికెట్కి ఉదారంగా సాయం చేసినట్లు హాకీకి సాయం అందించడానికి దాతలు ముందుకు రావడం లేదు.
టి.యువరాణి, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!