విద్యార్థుల మేధా‘శక్తి’
పెట్రోల్, డీజిల్తో కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చినవే ఎలక్ట్రిక్ వాహనాలు. అవి ఆగకుండా నడవవాలంటే ఛార్జింగ్ కేంద్రాలు తప్పనిసరి.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు వినూత్న ఆలోచన
ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థినులు
విశాఖపట్నం, సింధియా, న్యూస్టుడే: పెట్రోల్, డీజిల్తో కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చినవే ఎలక్ట్రిక్ వాహనాలు. అవి ఆగకుండా నడవవాలంటే ఛార్జింగ్ కేంద్రాలు తప్పనిసరి. అయితే...ఎలాంటి ఛార్జింగ్ కేంద్రాలు అవసరం లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే అవి ఛార్జ్ అయ్యేలా విద్యార్థులు తమ ఆలోచనకు ప్రాథమికంగా ఆచరణ రూపం ఇచ్చారు. వారే... బోడే అనీషా ప్రగ్న, చొప్పా జ్ఞానేశ్వరి, బాత్తి భువనేశ్వరి. వీరు శ్రీహరిపురంలోని మిసెస్ మరియదాస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అనీషా ప్రగ్న తన కుటుంబ సభ్యులతో ఒకసారి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తున్నపుడు అది మధ్యలో ఆగి ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచనను స్నేహితులతో పంచుకున్నారు. తరువాత సైన్స్ ఉపాధ్యాయురాలు సుజాత సూచనలతో ‘వైర్లెస్ ఛార్జింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ యూసింగ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ ’ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎలాంటి తీగల సహాయం లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ అయ్యేలా, ప్రయాణం మధ్యలో ఆగాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందంటున్నారు. ఎలక్ట్రిక్ కారు, బస్సు, స్కూటీ అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది ఉపయోగడుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు 2022-23 సంవత్సరం ‘ది మ్యాక్మిలన్ బడ్డింగ్ సైంటిస్టు అవార్డు ’కు ఎన్నికైంది. ఇందులో దక్షిణాది నుంచి 4వేలకు పైగా ప్రాజెక్టులు నామినేషన్లలో పాల్గొనగా ఆంధ్రపదేశ్ నుంచి ఈ ప్రాజెక్టు ఎన్నికైందని, ఫిబ్రవరి 17, 18న ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో జరిగే రెండో స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు విద్యార్థులు వివరించారు.
రోడ్డు మీద అమర్చే అయస్కాంత ప్రేరణ శక్తి పరికరాల నమూనా
పనితీరు ఇలా: ‘అయస్కాంత ప్రేరణ శక్తి కలిగిన పరికరాలను రోడ్డు మీద, ఎలక్ట్రిక్ వాహనానికి అడుగు భాగంలో బిగించాలి. రోడ్డుపై అమర్చే పరికరాన్ని ట్రాన్స్మీటర్ అంటారు. ఎలక్ట్రిక్ వాహనం అడుగు భాగంలోని పరికరాన్ని రిసీవర్ అంటారు. రహదారిపై వీటిని నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాలి. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాన్స్మీటర్, రిసీవర్ మధ్య జరిగే చర్యతో ఎ.సి. విద్యుత్తు డి.సి. విద్యుత్తుగా మారుతుంది. అలా మారిన సందర్భంలోనే వాహనాలు వాటంతట అవే ఛార్జ్ అవుతాయి. ఎలాంటి తీగలు ఉపయోగించకుండానే ఈ పరికరాలు పనిచేస్తాయి’ అని తమ ప్రాజెక్టు తీరును వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?