logo

వీఆర్వో లైంగిక వేధింపులు

పేట మండలం పీఎల్‌ పురం వీఆర్వో భాస్కరనాయుడు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ వివాహిత అధికారులకు ఫిర్యాదు చేయడం, ఆమె తరఫు బంధువులు అతడికి దేహశుద్ధి చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

Published : 31 Jan 2023 04:21 IST

దేహశుద్ధి చేసిన బాధితురాలి బంధువులు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పేట మండలం పీఎల్‌ పురం వీఆర్వో భాస్కరనాయుడు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ వివాహిత అధికారులకు ఫిర్యాదు చేయడం, ఆమె తరఫు బంధువులు అతడికి దేహశుద్ధి చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎల్‌పురం ఎస్సీ కాలనీకి చెందిన వివాహిత తన ఇద్దరు బిడ్డలతో జీవిస్తోంది. ఇంటి స్థల కోసం రెవెన్యూ అధికారులకు గతంలో దరఖాస్తు చేసింది. సాంకేతిక కారణాలు చూపుతూ అధికారులు ఆమెకు స్థలం మంజూరు చేయలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి భాస్కరనాయుడు ఇంటి స్థలం ఇస్తానని, తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ తన కోరిక తీర్చాలంటూ వేధించడంతోపాటు ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు. విసిగిపోయిన బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. అనంతరం వారితో కలిసి సోమవారం పంచాయతీ కార్యాలయానికి వచ్చింది. అక్కడే ఉన్న వీఆర్వోను నిలదీసి అందరిలో ప్రశ్నించింది. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలితోపాటు ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. అనంతరం తహసీల్దారు జైప్రకాశ్‌తోపాటు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని