‘ముడసర్లోవ’పై నేతల పాచిక
మహా విశాఖ నగరపాలక సంస్థ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పెద్దఎత్తున సాగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలో యూజీడీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తనఖా పెట్టిన జీవీఎంసీ అధికారులు..
282 ఎకరాలు కట్టబెట్టేలా అడుగులు
కౌన్సిల్ అజెండాలో ప్రతిపాదనపై తీవ్ర చర్చ
కార్పొరేషన్, న్యూస్టుడే
ముడసర్లోవ వద్ద నిర్మిస్తున్న ప్రహరీ
మహా విశాఖ నగరపాలక సంస్థ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి పెద్దఎత్తున సాగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలో యూజీడీ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తనఖా పెట్టిన జీవీఎంసీ అధికారులు.. తాజాగా ముడసర్లోవ, పూర్ణమార్కెట్ లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. మరో వైపు గతంలో వేసిన కొన్ని రహదారులనే జీ-20 సదస్సుల పేరిట మళ్లీ నిర్మించడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గోపాలపట్నం నుంచి ఎన్ఏడీ వరకు అమృత్ పథకంలో భాగంగా తవ్విన రహదార్ల మరమ్మతులకు జీవీఎంసీ నిధులు వెచ్చిస్తుండడం అనుమానాలకు దారి తీస్తోంది.
పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం: ముడసర్లోవ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఆరిలోవ, పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవీఎంసీకి ఉన్న ఏకైక జల వనరైన ఈ రిజర్వాయర్కు కూడా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. గతంలో రిజర్వాయర్లో హైటెక్ బోర్లు వేయడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వన్యప్రాణులు సంచరించే పరివాహక ప్రాంతంలో పార్కులు నిర్మిస్తామంటే ఉద్యమిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
గతంలోనే వ్యూహం: వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముడసర్లోవ భూములపై కొందరు నాయకుల కన్ను పడింది. ముడసర్లోవ రిజర్వాయర్ను ఆనుకుని జీవీఎంసీకి 800 ఎకరాల స్థలం ఉంది. పరివాహక ప్రాంతం కావడంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినా అక్కడి భూములు కొట్టేయాలని వైకాపా నేతలు కొందరు రెండు సార్లు వీఎంఆర్డీఏ అధికారులతో, మూడు సార్లు జీవీఎంసీ అధికారులతో అక్కడ పర్యటించారు. గోల్ఫ్ కోర్స్కు కేటాయించిన 116 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవడానికి అవకాశాలు పరిశీలించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నాడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోల్ఫ్ కోర్స్ నిర్వాహకులుగా ఉన్న నావికాదళ ఉన్నతాధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేశారు. ఆ తరువాత మిగిలిన భూములపై కొందరు నేతలు కన్నేశారు. పాలకవర్గాన్ని ఉపయోగించి పీపీపీ (ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం) ద్వారా థీమ్ పార్కులు నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ముడసర్లోవ భూముల రక్షణ కోసమని రూ.9 కోట్లతో ప్రహరీ నిర్మిస్తుండడం ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ పనులు అయిన తరువాత ఇక్కడ దాదాపు 282 ఎకరాల భూమిని ఇతరులకు అప్పగించే కార్యాచరణ సాగుతోందని సమాచారం.
బాగున్న రోడ్లపైనే: జీ-20 సన్నాహక సదస్సుల పేరిట రూ.27కోట్లతో నోవాటెల్ చుట్టు పక్కల ఉన్న రహదారులపై బీటీ లేయర్ వేయడం, నడక మార్గాల అభివృద్ధి, పాడైపోయిన టైల్స్ను తిరిగి ఏర్పాటు చేయటానికి అధికారులు ప్రతిపాదించారు. ఇటీవల నావికాదళ విన్యాసాలు జరిగినప్పుడు రూ.15కోట్లతో ఈ ప్రాంతాల్లో జీవీఎంసీ సుందరీకరణ పనులు చేపట్టింది. ఆర్నెళ్లు దాటక ముందే తిరిగి ప్రతిపాదనలు తయారు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కమిషనర్ రాజాబాబును వివరణ కోరగా రహదారిపై బీటీ లేయర్ అవసరమని భావిస్తేనే పునరుద్ధరణ పనులు చేపడ తామని, లేకుంటే రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు.
పెందుర్తి- గోపాలపట్నం మార్గంలో రహదారి ఇలా..
* గోపాలపట్నం నుంచి ఎన్ఏడీ వరకు రూ.240 కోట్లతో 24 గంటల తాగునీటి సరఫరా ప్రాజెక్టు జరుగుతోంది. ప్రాజెక్టులో భాగంగా రహదారిని తవ్వేశారు. పనులు పూర్తయిన తరువాత రహదారిని గుత్తేదారు పునరుద్ధరించాల్సి ఉంది. అయితే..జీవీఎంసీ అధికారులు రూ.8 కోట్లతో పనులు ప్రతిపాదించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక వేళ పనులు చేస్తే.. సంబంధిత గుత్తేదారు నుంచి ఆ నిధులు వసూలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడు ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు