విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు అసంతృప్తికరం: గవర్నర్
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉపకులపతులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల సంఖ్య అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.
ఏయూ తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్ను రిమోట్తో
ప్రారంభిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈనాడు, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉపకులపతులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల సంఖ్య అసంతృప్తిని కలిగిస్తోందన్నారు. ప్రపంచస్థాయి ర్యాంకింగులకు మన దేశ వర్శిటీలు పోటీపడాలన్నారు.విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏఐయూ (అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్), ఏయూ సహకారంతో ఉన్నత విద్య రూపాంతరీకరణ కోసం పరిశోధన, సమర్థత (రీసెర్చ్ అండ్ ఎక్స్లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్) అనే అంశంపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాలు పరిశోధనలపై దృష్టి సారించకుండా కేవలం విద్యను అందించడానికే పరిమితం అవుతున్నాయని, 95 శాతం విద్యా సంస్థలు ఇలానే చేస్తున్నాయన్నారు. గతంలో శాస్త్రీయ పరిశోధనలు అధికంగా జరిగేవి. ఇప్పుడు ఆ స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా ప్రజావసరాలు, అభివృద్ధికరమైన అంశాలపై శోధన జరగాల్సి ఉందన్నారు. ప్రపంచ మేధోసంపత్తి హక్కుల 2017 సూచిక ప్రకారం చైనా 13 లక్షల పేటెంట్ హక్కులను పొందింతే అమెరికా 6.6 లక్షల హక్కులు పొందింది. అదే మన దేశం కేవలం 50 వేల హక్కులను మాత్రమే పొందింది. ఇందులో 68 శాతం ఎన్ఆర్ఐల నుంచి వచ్చినవే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. అందుకు విశ్వవిద్యాలయాలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఉపాధి కల్పనావకాశాలు సృష్టించడం, నైపుణ్య భారత్ నిర్మాణంలో ఉపకులపతులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, ఆసక్తి పెంచే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో భారత్ ప్రధాన పాత్ర పోషించే స్థాయికి చేరిందని గవర్నర్ అన్నారు. వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అణుపరీక్షలతో శత్రు దేశాలు వెనక్కి తగ్గాయి. దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదనే సందేశం ఆ పరీక్షల ద్వారా ప్రపంచానికి చెప్పగలిగామన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ 2020 నూతన విద్యావిధానాన్ని ఏపీ అందిపుచ్చుకొని సంస్కరణలకు నాంది పలికిందన్నారు. ఏఐయూ అధ్యక్షుడు సురంజన్ దాస్, ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్ ఏఐయూ కార్యకలాపాల గురించి వివరించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపకులపతులు ఏయూలోని పరిశోధనలను పరిశీలించి తగు సూచనలు చేస్తే వాటిని అమలు చేస్తామన్నారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ కె.రామ్మోహనరావు, ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, దక్షిణ భారతదేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇందులో పాల్గొన్నారు.
తాళపత్ర గ్రంథం
తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ ప్రారంభం
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ గ్రంథాలయం చేపట్టిన తాళపత్రాల డిజిటలైజేషన్ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిమోట్తో ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్ హాలులో మంగళవారం జరిగిన దక్షిణ భారతదేశ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో పాల్గొన్న గవర్నర్ రిమోట్ సాయంతో దీనిని ప్రారంభించారు. డిజిటలీకరణ వల్ల అపురూపమైన తాళపత్ర గ్రంథాలు చెడిపోకుండా భావితరాలకు ఉపయోగపడతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట