టైరు పగిలి... వేగంగా ఢీకొట్టి
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మేధినీపూర్ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి.
ఐదుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
ప్రమాదంలో ధ్వంసమైన కార్లు
న్యూస్టుడే, కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మేధినీపూర్ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్, ప్రత్యక్షసాక్షులు వివరాలు తెలిపారు. సికింద్రాబాద్కు చెందిన నితిన్ పటేల్ సిద్దిపేటలో టైల్స్ ఆర్డర్ తీసుకున్నారు. కియా కారులో స్వస్థలానికి తిరిగి వెళ్తున్నారు. అకస్మాత్తుగా కారు ముందు టైరు పగిలిపోయింది. అదుపు తప్పిన వాహనం కుడివైపున రహదారిపై హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న స్విఫ్ట్ కారును బలంగా ఢీకొట్టింది. ఫలితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న గుత్తేదార్లు విశాఖపట్నానికి చెందిన మజ్జి సత్యనారాయణ, మజ్జి అప్పారావు, కురువాడ గోవిందు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివసిస్తున్నారు. కారు డ్రైవర్ తిప్పాపూర్ వాసి దమ్మాయి రాము, చోదకుడు నితిన్ పటేల్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కుకునూరుపల్లి పోలీసులు వెంకట్గౌడ్, రాజు, శేఖర్, బాలరాజ్, టోల్గేట్ అంబులెన్స్ సిబ్బంది శ్రీనివాస్, రాజు, శ్రీరాజు హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేసి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోవిందు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!