logo

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

లొడగలవానిపాలెం పంచాయతీ నేల్తేరు గ్రామానికి చెందిన బంక సురేష్‌ (28) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు.

Published : 01 Feb 2023 05:25 IST

సురేష్‌ (పాతచిత్రం)

ఆనందపురం, న్యూస్‌టుడే: లొడగలవానిపాలెం పంచాయతీ నేల్తేరు గ్రామానికి చెందిన బంక సురేష్‌ (28) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. ఆ వివరాలిలా.. ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న సురేష్‌ సెలవుపై స్వగ్రామం వచ్చారు. మంగళవారం గ్రామ శివారునున్న చెరువు గట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌కు రెండేళ్ల క్రితం సంధ్యతో వివాహం జరిగింది. ఆరు నెలల వయసున్న కుమార్తె ఉంది. తండ్రి గతంలో మరణించినందున తల్లి నాగమణి, అక్క వరలక్ష్మితో కలిసి సురేష్‌ నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమునిపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని