56 ప్రతిపాదనలు.. 10 నిమిషాల్లో ఆమోదం
మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం బుధవారం వాడివేడిగా కొనసాగింది. మునుపెన్నడూలేని విధంగా 120 అంశాలను ప్రతిపాదించి జీవీఎంసీ అధికారులు రికార్డు సృష్టించారు.
ఇదీ కౌన్సిల్లో అధికార వైకాపా తీరు
మీడియాను నియంత్రించే యత్నం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయరు గొలగాని హరి వెంకట కుమారి
కార్పొరేషన్, న్యూస్టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం బుధవారం వాడివేడిగా కొనసాగింది. మునుపెన్నడూలేని విధంగా 120 అంశాలను ప్రతిపాదించి జీవీఎంసీ అధికారులు రికార్డు సృష్టించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు సమావేశం కొనసాగింది. ప్రతిపాదనల్లో ఒకటి మినహా మిగతావన్ని ఆమోదం పొందడం మరో విశేషం. కొన్ని అంశాలను నిమిషాల్లో ఆమోదించడంతో ప్రతిపక్ష కార్పొరేటర్లు అవాక్కయ్యారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికార వైకాపా కార్పొరేటర్లు లెక్కచేయలేదు.
* సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన భాజపా సీనియర్ నేత పీవీ చలపతిరావు, విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ ఆడారి తులసీరావులకు సభ్యులు నివాళులర్పించారు. కౌన్సిల్ సమావేశంలో మీడియా కోసం కేటాయించిన స్థలంలో కుర్చీలను తొలగించారు. గ్యాలరీలో విలేకర్లు కూర్చోవాలని మేయరు, కమిషనర్ సూచించారు. ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. 10 నిమిషాల తరువాత యథావిధిగా కుర్చీలను ఏర్పాటు చేశారు.
* హెల్త్ సిటీలోని 2.83 ఎకరాల స్థలంలో వాకింగ్ ట్రాక్, బల్లలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై తూర్పు శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఆ స్థలం జీవీఎంసీకి దఖలు పడేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారని, ఆ స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించడానికి ప్రతిపాదనలు పెట్టాలని కోరారు. దీనికి మేయరు అంగీకరించారు.
* నగరంలో జీ-20 సన్నాహక సదస్సు పేరుతో కొన్ని ప్రాంతాలకే అభివృద్ధిని పరిమితం చేయడం సరికాదని తెదేపా కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముందుగా పనులు చేస్తే, తరువాత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని కమిషనర్ రాజాబాబు తెలిపారు. అనంతరం జీ-20 సదస్సుకు సంబంధించి అజెండాలో 28 నుంచి 48 వరకు ఉన్న అంశాలను ఆమోదిస్తున్నట్లు మేయరు ప్రకటించారు.
* నగరంలో సర్వే చేసి భూహక్కులు కల్పించే పథకానికి జీవీఎంసీ నిధులు ఎలా బదలాయిస్తారని తెదేపా ఫ్లోర్ లీడర్ ప్రశ్నించారు. రూ.2.07కోట్లతోనే సర్వే పూర్తవుతుందా అంటూ నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.76కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టులు ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందా అని సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు ప్రశ్నించారు. జీవీఎంసీ నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ధ్వజమెత్తారు.
రూ.15వేల వేతనం పెంపు వాయిదా: ఉద్యాన విభాగంలో పలువురి సిబ్బంది వేతనం రూ.27వేల నుంచి రూ.42వేలకు పెంచే ప్రతిపాదన చేర్చడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రూ.16లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయని సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు తెలిపారు. దీంతో ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయరు ప్రకటించారు.
* బీఆర్టీఎస్ రహదారిలో అడవివరం నుంచి గోశాల వరకు 2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరహా నరసింహం కోరారు. దీనిపై సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మేయరు హామీ ఇచ్చారు. మెకానికల్ విభాగంలో వాహనాలకు భారీగా ధరలు పెంచే ప్రతిపాదనలపై అభ్యంతరాల నడుమ మేయర్ ఆమోదం తెలిపారు. అనుబంధ అజెండాలోని 40 అంశాలు, టేబుల్ అజెండాలోని 16.. మొత్తం 56 ప్రతిపాదనలపై పూర్తిగా చర్చించకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఆమోదం తెలపడం గమనార్హం. సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ