282 ఎకరాలు.. అప్పగింతే!!
ముడసర్లోవలో 282 ఎకరాల భూమిని పీపీపీ( ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేసేందుకు.. ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే పాలకవర్గం ఆమోదం తెలిపింది.
ప్రతిపక్షాలు అడ్డుకున్నా కనిపించని ఫలితం
‘ప్రైవేటు’ చేతికి ముడసర్లోవ భూములు
తోపులాటల మధ్య కౌన్సిల్లో ఆమోదం
మేయరు పోడియం ముందు బైఠాయించిన ప్రతిపక్ష కార్పొరేటర్లు
కార్పొరేషన్, న్యూస్టుడే: ముడసర్లోవలో 282 ఎకరాల భూమిని పీపీపీ( ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యం) విధానంలో అభివృద్ధి చేసేందుకు.. ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికే పాలకవర్గం ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నా...ఆందోళనలు చేస్తున్నా అధికార పార్టీ పట్టించుకోలేదు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో.. ఈ అంశంపై చర్చకు రాగానే ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. గందరగోళం మధ్య మేయరు గొలగాని హరి వెంకట కుమారి ఓటింగ్ నిర్వహించారు. సభలో ఉన్న వైకాపా, స్వతంత్ర అభ్యర్థులు 45 మంది అనుకూలంగా చేతులు ఎత్తారు. తెదేపా, ఇతర కార్పొరేటర్లు 22 మంది వ్యతిరేకించారు. మెజారిటీ సభ్యులు అంగీకరించడంతో ప్రతిపాదనను ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు.
పోడియంను చుట్టుముట్టినా: సమావేశం ప్రారంభమైన తర్వాత అనుబంధ అజెండాలో 49వ అంశంగా వచ్చిన ‘ముడసర్లోవ’ భూముల అప్పగింత అంశం చదవాలని కార్యదర్శి నల్లనయ్యకు మేయరు సూచించారు. ఆయన చదువుతుండగా సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గంగారావు, స్టాలిన్, జనసేన కార్పొరేటర్లు భీశెట్టి వసంతలక్ష్మి, పీతల మూర్తియాదవ్, దల్లి గోవిందరెడ్డి తమ స్థానాల్లో నిల్చుని ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా కార్యదర్శి ఆ అంశాన్ని చదువుతుండటంతో తెదేపా, జనసేన, ఇతర కార్పొరేటర్లు మేయరు పోడియాన్ని చుట్టుముట్టారు. వారిని అడ్డుకోవడానికి వైకాపా కార్పొరేటర్లు వచ్చి వలయంగా ఏర్పడ్డారు. అయినా ప్రతిపక్ష కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది.
చేతులెత్తి మద్దతు తెలుపుతున్న వైకాపా కార్పొరేటర్లు
పూర్ణమార్కెట్పై వెనుకడుగు..
పూర్ణమార్కెటను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే అంశంపై అధికార పక్షం వెనుకడుగు వేసింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తరువాత అధికారులు సవరించిన అంశంగా ప్రత్యేక అజెండా కాపీని అందజేశారు. అందులో పూర్ణమార్కెట్ను జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయడానికి డీపీఆర్ (సవివర పథక నివేదిక) తయారు చేయడానికి అనుమతి కోరారు. ప్రాజెక్టు నిర్మాణ దశలో పర్యవేక్షణ, సమన్వయానికి అవసరమైన ఏజెన్సీ కోసం ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) పిలవనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
[ 29-03-2024]
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. -
త్వరలోనే వైకాపా పాలనకు తెర
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజలను కష్టాలపాలు చేస్తున్న వైకాపా పాలనకు త్వరలోనే తెర పడుతుందని, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు. -
చోడవరం సమస్యలపై రాజుకు మొర
[ 29-03-2024]
‘బాబూ.. కుళాయిల్లో రోజూ తాగునీరు రావడం లేదు. ఇంతకుముందు చెత్తను తరలించేందుకు రోజూ పంచాయతీ బండి వచ్చేది -
‘జగన్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా జనం’
[ 29-03-2024]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం రాష్ట్రంలో విలయం తాండవం చేస్తున్నాయని విశాఖ లోక్సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు -
ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం
[ 29-03-2024]
పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు -
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేపట్టబోయే ఎలాంటి ప్రచారానికైనా సంబంధిత ఎన్నికల అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జున స్పష్టం చేశారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుకుగా పని చేయాలి
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్ ఎ.రవిశంకర్ ఆర్వోలు, ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు -
నారసింహ హోమం.. భక్తజన నీరాజనం
[ 29-03-2024]
భక్తజన పరంధాముడు నృసింహ స్వామి ఆవిర్భవించిన స్వాతి నక్షత్ర పర్వదినం రోజున సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నందుకు భక్తులు ఉప్పొంగిపోయారు. -
టిడ్కో ఇళ్లకు వీడని గ్రహణం
[ 29-03-2024]
తెదేపా హయాంలో పేదలకు కోసం కట్టించిన టిడ్కో ఇళ్లపై వైకాపా రాజకీయం చేస్తోంది. పార్టీ రంగులు వేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఆలోచనతో హడావుడిగా ప్రారంభించారు. -
విశాఖ కాదు..అచ్యుతాపురం నుంచే..!
[ 29-03-2024]
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) టెర్మినల్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన పూర్వ వైభవాన్ని కోల్పోనుంది -
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
విశాఖలోని ప్రతిష్ఠాత్మక నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్ షిప్యార్డు రక్షణ ఉత్పత్తుల సంస్థ’లో ఏళ్లు గడిచిపోతున్నా... ‘ఫ్లీట్ సపోర్ట్ షిప్(ఎఫ్ఎస్ఎస్)’ నిర్మాణం కొలిక్కి రావడం లేదు. దేశ రక్షణ అవసరాల నిమిత్తం వినియోగించే ఎఫ్ఎస్ఎస్ ఆర్డర్లను చేజిక్కించుకోవడానికి గతంలోనే షిప్యార్డు విశ్వ ప్రయత్నాలు సాగించింది. -
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్