logo

ఏయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా కిశోర్‌బాబు

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా కిశోర్‌బాబు నియమితులయ్యారు. ఇప్పటివరకు కొనసాగిన ఆచార్య కృష్ణమోహన్‌ పదవీకాలం గురువారంతో ముగిసింది.

Published : 03 Feb 2023 03:07 IST

ఈనాడు, విశాఖపట్నం, ఏయూ  ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా కిశోర్‌బాబు నియమితులయ్యారు. ఇప్పటివరకు కొనసాగిన ఆచార్య కృష్ణమోహన్‌ పదవీకాలం గురువారంతో ముగిసింది. ఏయూ కామర్స్‌ విభాగానికి చెందిన కిశోర్‌బాబు గతంలోనూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా సేవలందించారు. అప్పట్లో కృష్ణమోహన్‌ పదవీకాలం ముగిసిన తరువాత రెండోసారి పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకునే వరకూ ఈయన పనిచేశారు. కృష్ణమోహన్‌ పదవీ విరమణ పొందినా కొనసాగింపు   ఉత్తర్వులు తెచ్చుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

* సీనియర్‌ ఆచార్యులు ఉన్నప్పటికీ ఆయన్ను కొనసాగించడంపై పలువురు ఆక్షేపించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా కిశోర్‌    బాబును నియమించినప్పటికీ శాశ్వత ప్రాతిపదికన ఎవరు వస్తారనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పలువురు రిజిస్ట్రార్‌ పోస్టుపై ఆశ పెట్టుకున్నారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు ఆరంభించారు. కొందరు పెద్దలను కలిసి ఈ విషయం వివరించినట్లు తెలుస్తోంది. అయితే..ఉపకులపతి నిర్ణయం మేరకు ఈ నియామకం ఉండొచ్చని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు