పీజీ విద్యార్థిని ఆత్మహత్య
నగరంలో పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాధురి (పాతచిత్రం)
తాటిచెట్లపాలెం, న్యూస్టుడే: నగరంలో పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం కాపువీధి ప్రాంతానికి చెందిన నున్న మాధురి(22) జ్ఞానాపురంలోని ఒక కళాశాలలో పీజీ చదువుతూ అక్కడే కళాశాలకు చెందిన హాస్టల్లోనే ఉండేది. ఇటీవల సంక్రాంతి పండగ సెలవులకు మాధురి స్వగ్రామం వెళ్లి బుధవారం కళాశాలకు వచ్చినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మాధురి తరగతులకు హాజరు కాకపోవడంతో తోటి విద్యార్థినులు ఆమె కోసం హాస్టల్లోని గదికి వెళ్లి చూడగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్కు తెలియజేశారు. యువతిని కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు కళాశాల సిబ్బంది గుర్తించారు. దీంతో వారు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకుమార్, ఎస్సై దివ్యభారతి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సిబ్బందిని, తోటి విద్యార్థులను అడిగి కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమీ లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థంకావడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దివ్యభారతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పంపిన బండి... జనం గుండె మండి!!
[ 17-04-2024]
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్న చందంగా రేషను సరకుల పంపిణీ తయారైంది. సీఎం నిర్ణయం ప్రకారం మల్టీ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు జిల్లాకు వచ్చాయి. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 17-04-2024]
సంచలనం సృష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తుది తీర్పు నేపథ్యంలో మంగళవారం విశాఖ కోర్టులో ఉత్కంఠ నెలకొంది. -
కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్లపై చర్యలు
[ 17-04-2024]
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
వడగాల్పుల ఉద్ధృతి
[ 17-04-2024]
జిల్లాలో వడగాలులు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం విశాఖ నిప్పుల కుంపటిని తలపించింది. జిల్లావ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీచాయి. -
సివిల్స్లో సత్తాచాటిన గిరి పుత్రుడు
[ 17-04-2024]
పట్టుదల, ఆత్మ విశ్వాసంతో చదివితే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు గిరి యువకుడు. హుకుంపేట మండలం అండిభ గ్రామానికి చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ సివిల్స్లో 545వ ర్యాంక్ సాధించారు. -
ఆరోగ్య వేషం.. ఇది కాదా మోసం!!
[ 17-04-2024]
లంకెలపాలెం యూపీహెచ్సీలో వారానికి నాలుగు రోజులు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని బోర్డు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం చర్మ వ్యాధులకు సంబంధించిన ఓపీ చూడాల్సి ఉండగా.. వైద్యురాలు సెలవులో ఉన్నారు. -
కీలక ఘట్టం.. నామపత్రం స్వీకరణ
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నది. ఆ రోజు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. -
విద్యావంతుల చేతుల్లో రాష్ట్ర భవిత : తెదేపా
[ 17-04-2024]
ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు విద్యావంతులు, మేధావుల చేతుల్లోనే ఉందనివిశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అరాచక పాలనకు స్వస్తి పలికి, అభివృద్ధికి బాటలు వేసే తెదేపా కూటమికి ఓటేయాలని కోరారు. -
ఇంటింటికి అన్నారు.. వీధుల్లో పెట్టారు
[ 17-04-2024]
చౌక ధరల దుకాణాల్లో రేషను సరకులు తీసుకునే లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లకుండానే.. ఇంటి ముంగిటకే సరకులు చేరవేస్తాం. ఇంటింటికీ వచ్చి సరకులు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేశారు. -
వైకాపా హయాంలో ప్రజారోగ్యానికి పాతర
[ 17-04-2024]
వైకాపా పాలనలో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. పెందుర్తి, చినముషిడివాడ, పురుషోత్తపురంలో యూపీహెచ్సీలు ఉన్నప్పటికీ సీహెచ్సీకి వచ్చే రోగులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు. -
యువశక్తి హోరు.. తెదేపా శ్రేణుల్లో జోరు
[ 17-04-2024]
తెలుగుదేశం పార్టీ పాలనలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకువస్తే, వైకాపా పాలకులు వాటిని తరిమేసి గంజాయికి అడ్డాగా మార్చేశారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!