logo

పీజీ విద్యార్థిని ఆత్మహత్య

నగరంలో పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 03 Feb 2023 03:28 IST

మాధురి (పాతచిత్రం)

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: నగరంలో పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం కాపువీధి ప్రాంతానికి చెందిన నున్న మాధురి(22) జ్ఞానాపురంలోని ఒక కళాశాలలో పీజీ చదువుతూ అక్కడే కళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉండేది. ఇటీవల సంక్రాంతి పండగ సెలవులకు మాధురి స్వగ్రామం వెళ్లి బుధవారం కళాశాలకు వచ్చినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మాధురి తరగతులకు హాజరు కాకపోవడంతో తోటి విద్యార్థినులు ఆమె కోసం హాస్టల్‌లోని గదికి వెళ్లి చూడగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు. యువతిని కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు కళాశాల సిబ్బంది గుర్తించారు. దీంతో వారు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకుమార్‌, ఎస్సై దివ్యభారతి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సిబ్బందిని, తోటి విద్యార్థులను అడిగి కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమీ లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థంకావడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దివ్యభారతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని