100 అంశాలతో..స్థాయీ సమావేశం
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని 100 అంశాలతో నిర్వహించడానికి అజెండా కాపీలను సభ్యులకు జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య గురువారం అందజేశారు.
శనివారం ఉదయం 11 గంటలకు..
కార్పొరేషన్, న్యూస్టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని 100 అంశాలతో నిర్వహించడానికి అజెండా కాపీలను సభ్యులకు జీవీఎంసీ కార్యదర్శి పల్లి నల్లనయ్య గురువారం అందజేశారు. రికార్డు స్థాయిలో 120 అంశాలతో బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించి చరిత్ర సృష్టించిన అధికారులు, ఏకంగా 100 అంశాలతో స్థాయీ సమావేశం నిర్వహించడానికి అజెండా అందజేసిన అధికారులు.. టేబుల్ అజెండాగా ఇంకా ఎన్ని అంశాలను చేర్చనున్నారో అనే చర్చ సాగుతోంది. శనివారం ఉదయం 11 గంటలకు స్థాయీ సమావేశం ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కానుంది.
* జి-20 సన్నాహక సదస్సులు నేపథ్యంలో రూ.49లక్షల్లోపు పనులను స్థాయీ అజెండాలో చేర్చారు. రహదారుల పునరుద్ధరణ, నడక మార్గాల అభివృద్ధి, రహదారిపై రంగులు, విద్యుద్దీపాలంకరణ వంటి అంశాలను చేర్చారు. విద్యుత్తు స్తంభాలకు, చెట్లకు విద్యుత్తు దీపాలు అమర్చేలా ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నగరానికి వచ్చిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి రూ.4.81లక్షలు వ్యయం చేసినట్లు ప్రతిపాదించారు. ప్రధాని వచ్చి నాలుగు నెలలు అవుతుండగా ఇప్పుడు ఆయా పనులను ప్రతిపాదించడం అనుమానాలు రేపుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు తరలించడానికి రూ.12లక్షల వరకు ప్రతిపాదించారు. కొన్ని అంశాలలో ఎక్కడ, ఎన్ని పనులు చేస్తున్నామో కూడా కనీసం ప్రచురించకపోవడం గమనార్హం. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్స్, పైవంతెన పిల్లర్లకు రంగులు వేయడానికి రూ.48.50లక్షలతో ప్రతిపాదించారు. షీలానగర్ నుంచి ఆర్అండ్బీ కాలనీ వరకు విభాగినుల మరమ్మతులకు రూ.31 లక్షలతో ప్రతిపాదించారు.
* గతంలో అద్దెకు... ఇప్పుడు కొనుగోలు: నగరంలో ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగినప్పుడు అద్దె ప్రాతిపదికన సీరియల్సెట్స్ పెడుతుండేవారు. జి-20 సన్నాహక సదస్సుల నిర్వహణ కోసం రూ.29.20లక్షల వ్యయంతో 30కేవీ సామర్థ్యం గల నాలుగు జనరేటర్లు కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు. రూ.1.38కోట్ల వ్యయంతో సీరియల్సెట్స్ కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు.
శ్మశానాలకు రూ.15.06 కోట్లు..
జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల్లో 38 శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ఏకంగా రూ.15.06 కోట్లు కేటాయించారు. గరిష్ఠంగా రూ.48.97 లక్షలు, కనిష్ఠంగా రూ.25 లక్షలు కేటాయించారు. కేవలం బర్నింగ్ఫ్లాట్ ఫాం, ప్రహరీ, చిన్న వేచి ఉండే గది నిర్మాణానికి రూ.49 లక్షల వరకు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నగర శివారులో ఆయా పనులు ప్రతిపాదించారు. ఆరిలోవ, భీమిలి, మధురవాడ, పెందుర్తి, గోపాలపట్నం పరిసరాల్లో శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. ఒకేసారి శ్మశానాల అభివృద్ధికి రూ.15.06కోట్లు స్థాయీ సమావేశంలోనూ, కౌన్సిల్ సమావేశంలో మరో రూ.5కోట్లు కేటాయించడం చర్చకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు