అక్రమమంటూనే చర్యలకు వెనకడుగు
జిల్లాలోని స్థిరాస్తి లేఅవుట్లలో చాలావరకు అనుమతుల్లేకుండా వేసినవేనని గుర్తించారు. ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని వారించారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులన్నీ తెచ్చుకుని అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు.
637 లేఅవుట్లకు అనుమతి లేదని గుర్తింపు
నేతల ఒత్తిళ్లతో మిన్నకున్న అధికారులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
అచ్యుతాపురం-అనకాపల్లి మార్గంలో చోడపల్లి సమీపంలో అనుమతుల్లేని ఓ లేఅవుట్
జిల్లాలోని స్థిరాస్తి లేఅవుట్లలో చాలావరకు అనుమతుల్లేకుండా వేసినవేనని గుర్తించారు. ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని వారించారు. సంబంధిత శాఖల నుంచి అనుమతులన్నీ తెచ్చుకుని అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. దీనికోసం ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ బృందాన్నీ నియమించారు. తీరా అక్రమ లేఅవుట్లన్నీ గుర్తించిన తర్వాత నేతల ఒత్తిళ్లతో రియల్టర్లపై చర్యలకు వెనకడుగు వేశారు..దీంతో విజిలెన్స్ తనిఖీల పేరుతో చేసిన హంగామా అంతా వృథా ప్రయాసగానే మిగిలిపోయింది.
ఉమ్మడి జిల్లాలో అధికారులు గుర్తించిన అక్రమ లేఅవుట్లే 637 వరకు ఉన్నాయి. ఇంకా గుర్తించనివి చాలానే ఉన్నాయి. ఒక్క నర్సీపట్నం డివిజన్లోనే 560 ఎకరాల్లో పుట్టగొడుగుల్లా అనధికారిక లేఅవుట్లు వెలిశాయి. పట్టణానికి సమీపంలో ఎకరం ధర రూ.కోట్లలో పలుకుతోంది. దీంతో పంట పొలాలను చదునుచేసి మట్టిని పోసి, రాళ్లు పాతి ప్లాట్లుగా చూపుతున్నారు. ధర్మసాగరం పంచాయతీల పరిధిలో రెండేసి, చెట్టుపల్లి, కేఎల్పురం ప్రాంతాల్లో రెండు లే-అవుట్లకు అనుమతులు లేవు.
* సంపతిపురంలో కొన్ని లే అవుట్లకు గెడ్డలను కప్పేసి రహదారి నిర్మాణాలు చేపట్టారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో మూడు, తిమ్మాపురంలో ఏడు, నక్కపల్లిలో 15 వరకు అనధికారిక లేఅవుట్లున్నాయి. విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించినా ఇప్పటి వరకు వాటిపై చర్యలు చేపట్టలేదు.
* అనకాపల్లికి సమీపంలోని బవులవాడలో అధికార పార్టీ నాయకుడి అండతో అనధికార లేఅవుట్ వేశారు. సత్యనారాయణపురం పంచాయతీలోని ఒక పెద్ద లేఅవుట్కి ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములను రహదారులుగా మార్చి స్థలాల అమ్మకాలు చేశారు.
ఫిర్యాదులు చేసినా..
నర్సీపట్నం మండలంలోని గబ్బాడ పరిధిలో సుమారు పది లేఅవుట్లు వేశారు. ఒక్కదానికి కూడా అనుమతుల్లేవు. దీనిపై స్థానిక సర్పంచి రాజేశ్వరి, ఆమె భర్త రాజబాబు పలుమార్లు పంచాయతీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు డీపీవోగా ఉన్న శిరీషారాణి నర్సీపట్నం డీఎల్పీవోగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ లేఅవుట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. ఆ మేరకు బోర్డులు తయారుచేశారు. కార్యదర్శిపై పైస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి ఆ బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. ఆ అంశంపై పంచాయతీ నుంచి ఒత్తిడి తెచ్చినప్పుడుల్లా కార్యదర్శులను బదిలీ చేస్తున్నారే తప్ప వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల స్పందనలోనూ మరోసారి ఫిర్యాదుచేశారు.
నర్సీపట్నం మండలం గబ్బాడ పరిధిలోని అక్రమ లేఅవుట్లలో పెట్టడానికి తయారుచేసిన హెచ్చరిక బోర్డు నెలల తరబడి కార్యాలయంలోనే మగ్గుతోందిలా..
విజిలెన్స్ బృందం గతేడాది గుర్తించిన అక్రమ లేఅవుట్ల వివరాలు
డివిజన్ల వారీగా....
అనకాపల్లి - 352
నర్సీపట్నం - 162
విశాఖపట్నం - 123
నిబంధనలు ఏం చెబుతున్నాయ్..
* భూ వినిమయ స్థితి మార్చడానికి ముందుగానే రెవెన్యూ అనుమతులు పొందాలి.
* లేఅవుట్ కోసం పంచాయతీలకు దరఖాస్తుచేసి వారి ద్వారా వీఎంఆర్డీఏ అనుమతులు కోరాలి. అది వచ్చాక పంచాయతీల్లో తీర్మానం జరగాలి. ఈ క్రమంలో పంచాయతీలకు పన్ను చెల్లించాలి.
* నిర్దేశిత స్థలంలో 10 శాతం సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఆ భూమిని పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయించాలి.
* లేఅవుట్లలో ప్రధాన రహదారి కనీసం 30 అడుగుల వెడల్పు తగ్గకుండా ఉండాలి.
కమిషనరేట్కు పంపించాం..
- శిరీషారాణి, జిల్లా పంచాయతీ అధికారిణి
విజిలెన్స్ బృందాలు గుర్తించిన అనుమతుల్లేని లేఅవుట్ల వివరాలను కమిషనరేట్ కార్యాలయానికి పంపించాం. వాటి క్రమబద్ధీకరణపై వారే నిర్ణయం తీసుకుంటారు. అదే జరిగితే పంచాయతీలకు 10 శాతం స్థలం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా విజిలెన్స్ బృందమేదీ లేదు. పంచాయతీ స్థాయిలో కార్యదర్శులే అడ్డుకోవాలి. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా