దేవుడా..నీ ఆస్తులు గోవిందా!
నర్సీపట్నం ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని తిరిగి తమ అధీనంలోకి తీసుకునే విషయంలో యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది.
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే
నర్సీపట్నం ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని తిరిగి తమ అధీనంలోకి తీసుకునే విషయంలో యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది. ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవి.. ఆక్రమణ నేరమని అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత వాటి ఆనవాళ్లు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. కోమటి రామాలయానికి చెందిన ఆక్రమిత భూమి వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు ఇలాగే మాయమయ్యాయి. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ భూముల్లో 80 సెంట్ల విలువైన స్థలం ఆక్రమణదారుల చేతిలో ఉందని గుర్తించిన అధికారులు కేసులు పెట్టారు. దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ లోపిస్తోంది.
ప్రహసనంగా లీజులు..
నర్సీపట్నం, బలిఘట్ట్టం గ్రూపు ఆలయాల పరిధిలో వందల ఎకరాలను ఏటా లీజుకు ఇస్తుంటారు. సత్యనారాయణస్వామి, బ్రహ్మలింగేశ్వరస్వామి తదితర ఆలయాలకు 311.07 ఎకరాల భూములున్నాయి. వీటిలో 133.30 ఎకరాలను అర్చకులు, ఇతర సేవకుల అనుభవనానికి ఇచ్చారు. మిగతా వాటికి లీజు రూపంలో కేవలం రూ.6.69 లక్షలు మాత్రమే వస్తోంది. మూడేళ్లకోసారి వేలం నిర్వహిస్తున్నప్పటికీ శిస్తులు ఏటా వసూలు చేస్తుంటారు. లీజుదారులు వరి, అపరాల పంటలే వేయాలి. కొన్నిచోట్ల సరుగుడు, అరటి వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న పరిస్థితి ఉంది.
* నూకాలమ్మ ఆలయానికి చెందిన రూ.8.07 ఎకరాలకు రూ.64 వేలు, సత్యనారాయణస్వామి ఆలయ భూములకు రూ. 48 వేలు, గొలుగొండ మండలంలోని ధారమల్లేశ్వరస్వామి ఆలయ భూములు 28.52 ఎకరాలకు రూ.70 వేల ఆదాయం వచ్చింది. బలిఘట్టం బ్రహ్మనంద ఆశ్రమానికి 50 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి నుంచి రూ.1.36 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. కొంత విస్తీర్ణంలో వాణిజ్య పంటల సాగు ఉందని సమాచారం.
* నాతవరం మండలం గంగాదేవి ఆలయానికి 13.02 ఎకరాలకు రూ.1.20 లక్షలు వస్తోంది. వీబీ అగ్రహారం రామలింగేశ్వరస్వామి ఆలయానికి 46 ఎకరాలకు 9.46 ఎకరాలను లీజుకు ఇచ్చారు. ఇందుకు రూ.55 వేలు శిస్తు వస్తోంది. వాణిజ్య పంటలు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాణిజ్య పంటల ద్వారా లీజుదారులు ఆదాయం పొందుతున్నా దేవుడికి మాత్రం తక్కువగా ఇస్తున్నారు.
* బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయానికి 126.76 ఎకరాల ఆస్తి ఉంది. ఇందులో 30 ఎకరాలు ఇటీవల రూ. 1.76 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఈ విస్తీర్ణం మొత్తాన్ని లీజుదారులు రూ.లక్షలు వెచ్చించి ఇటీవల చదును చేయించారు. వాణిజ్య పంటలు వేయడానికి ఇలా చదును చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఈ భూమిలో నుంచి వెళ్తున్న కాలువ ప్రవాహన్ని మట్టితో అడ్డుకట్ట వేయడం కనిపించింది.
పరిశీలించి చర్యలు
ఆక్రమణదారులపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. సత్వర న్యాయం కోసం చూస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడిన వారంతా చట్టపరమైన చర్యలకు గురవుతారు. కొన్నిచోట్ల లీజు ద్వారా తక్కువ ఆదాయమే వచ్చింది. కారణాలను అధ్యయనం చేస్తాం. పోటీలో ఎక్కువ మొత్తం లీజు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొన్ని ఆక్రమణలను నిరోధించాం. ప్రతి ఒక్కరూ లీజు నిబంధనలు పాటించాలి. లీజు ఖరారైనప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఉల్లంఘనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.
మురళీకృష్ణ, ఈఓ, బలిఘట్టం గ్రూపు ఆలయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు