logo

ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్‌ఐవోగా ఉమారాణి

ఉమ్మడి విశాఖ జిల్లా ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షక అధికారిణి (ఆర్‌.ఐ.ఒ.)గా భీమిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పి.ఉమారాణి శుక్రవారం పిఠాపురంకాలనీలో ఉన్న ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 04 Feb 2023 05:18 IST

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లా ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షక అధికారిణి (ఆర్‌.ఐ.ఒ.)గా భీమిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పి.ఉమారాణి శుక్రవారం పిఠాపురంకాలనీలో ఉన్న ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆర్‌.ఐ.ఒ, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారిగా వ్యవహరించిన పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రాయల సత్యనారాయణ  జిల్లా వృత్తివిద్యాశాఖాధికారిగా కొనసాగనున్నారు.  ఇప్పటి వరకు ఆర్‌.ఐ.ఒగా కొనసాగిన సత్యనారాయణ గత ఏడాది అక్టోబరు 31న రాత్రి వేళ ఆగమేఘాలపై బాధ్యతలు స్వీకరించడం, కేవలం మూడు నెలలకే ఈ బాధ్యతల నుంచి తప్పించడం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని