Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
విశాఖలోని రుషి కొండ (Rushikonda)ను బోడికొండగా మార్చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దానిని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్ (Jio matting) చేస్తోంది.
విశాఖపట్నం: భవనాల నిర్మాణం పేరుతో రుషికొండ (Rushikonda) ను బోడికొండగా మార్చేసిన ప్రభుత్వం (AP Govt) ఇప్పుడు దానిని కవర్ చేసేందుకు తంటాలు పడుతోంది. వచ్చే నెలలో జీ20 (G20 Summit) సదస్సు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కొండ ఆకుపచ్చగా ఉండేటట్లుగా జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్ (Geo matting) చేస్తున్నారు. రుషికొండను బోడిగుండులా తొలిచేయడంపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి.. పరిమితులను మించి రాష్ట్ర ప్రభుత్వం కొండలను తొలిచేసిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై గూగుల్ మ్యాప్లను సాక్ష్యాలుగా పరిగణించాలని న్యాయస్థానానికి అభ్యర్థించారు. ఈ తరుణంలో జియో మ్యాటింగ్ చేయడం చర్చనీయాంశమైంది.
అత్యంత ఖరీదైన ఈ మ్యాట్ను తొలుత కొండపై ఓ చోట పరిచారు. అక్కడ వృక్షజాలం పచ్చదనం పెరగడం కోసం ఇది తోడ్పడుతుందని అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ..ఒకవైపు జియో మ్యాట్ను పరిచే పని చేపట్టారు. కొద్ది రోజుల్లోనే మిగతా భాగాల్లోనూ పరుస్తామని చెబుతున్నారు. దీనివల్ల తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, పచ్చదనం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం జీ20 సదస్సును దృష్టిలో పెట్టుకొని ఇవి చేయడం లేదని, కొండ పరిరక్షణలో భాగంగానే చెయ్యాలని నిర్ణయించామంటున్నారు. రెండు నెలల క్రితమే ప్రయోగాత్మకంగా ఓ చోట జియో మ్యాట్ వేశామని, సత్ఫలితాలు రావడంతో మిగిలిన ప్రాంతానికీ విస్తరిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్